కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ తొలి టైటిల్ను గెలుచుకున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “RCB 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణం. రాజత్ పటిదార్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

తాను మ్యాచ్ పూర్తిగా చూశానని, ఆర్సీబీ యువకులు అద్భుతంగా ఆడారని అన్నారు. కర్ణాటక ప్రజల తరఫున వారికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. తాము ఆర్సీబీ జట్టును స్వాగతిస్తున్నామని, వాళ్లను ఎలా గౌరవించాలనే అంశంపై మా పోలీసులు, ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నదని తెలిపారు.
తాను కర్ణాటక హోంమంత్రితో, పోలీసులతో మాట్లాడుతానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఆర్సీబీ టీమ్ను స్వాగతించే సందర్భంగా ట్రాఫిక్తోపాటు తదితర అంశాలను మేనేజ్ చేయాల్సి ఉందని, దీనిపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఆర్సీబీ టీమ్ రాష్ట్రంలో అడుగుపెట్టగానే సంబురాలు చేసుకోవడం కోసం తాము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఈ విజయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆచార్య, మాజీ ఎమ్మెల్యే శివరాజ్, మాజీ ఎమ్మెల్సీ శివనగవల్లి తదితరులు అభినందనలు తెలిపారు.
Read Also : Gavaskar: ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ రన్నింగ్పై గవాస్కర్ అసంతృప్తి..