📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..

Author Icon By Divya Vani M
Updated: April 5, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు.. గత ఏడాది అక్టోబర్ 9న కన్నుమూశారు భారతీయ పారిశ్రామిక రంగంలో గొప్ప మార్గదర్శిగా నిలిచిన ఆయన తన ఆస్తులను ఎలా విభజించారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా, ఆయన వీలునామా వివరాలు వెల్లడయ్యాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.రతన్ టాటా తన సంపదలో అధిక శాతాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించారు. అతని పేరుతో ఉన్న ఎండోమెంట్ ఫౌండేషన్ వివిధ ట్రస్టులకు దాదాపు రూ.3,800 కోట్లు విరాళంగా ఇచ్చారు. టాటా సన్స్‌లో ఉన్న వాటాలతో పాటు ఇతర ఆస్తులను కూడా ఇందులో చేర్చారు.

Ratan Tata రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు

ఒకవేళ ఈ షేర్లను విక్రయించాల్సి వస్తే, ప్రస్తుత వాటాదారులకే అమ్మాలని ఆయన వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నారు.తన సవతి సోదరీమణులు శిరీన్ జజీభోయ్ దియానా జజీభోయ్‌లకు రూ.800 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్టాక్స్, ఖరీదైన వాచ్‌లు పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులు అందజేశారు.టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం.దత్తాకు రూ.800 కోట్ల ఆస్తులను అప్పగించారు.రతన్ టాటా సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు జుహులోని బంగ్లాలో వాటా, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను ఇచ్చారు.ఇక అలీబాగ్‌లో ఉన్న బంగ్లాను మూడు పిస్టోళ్లను తన ప్రియ మిత్రుడు మెహిల్ మిస్త్రీ పేరిట రాసినట్లు తెలుస్తోంది.జీవనకాలంలో వీధి కుక్కల సంరక్షణకు ఆసుపత్రులను ఏర్పాటు చేసిన రతన్ టాటా, వాటి సంరక్షణ కోసం రూ.12 లక్షల నిధులను ఏర్పాటు చేశారు.ప్రతి మూడు నెలలకు రూ.30,000 చొప్పున ఖర్చు చేసేలా నిధులను కేటాయించారు.తన జీవితాంతం తనకు తోడుగా ఉన్న శంతను నాయుడు విద్యా రుణాన్ని పూర్తిగా మాఫీ చేశారు. తన పొరుగింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి ఇచ్చిన రూ.23 లక్షల అప్పును కూడా రద్దు చేశారు.రతన్ టాటాకు విదేశాల్లో రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

సీషెల్స్‌లో భూములు, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలిసింది. ఆల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో షేర్లు కూడా ఉన్నాయి.అయన వద్ద 65 ఖరీదైన చేతి గడియారాలు ఉన్నట్లు సమాచారం.ఈ వీలునామా 2022 ఫిబ్రవరి 23న రాశారు. దీనిపై ప్రస్తుతం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆస్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడే అవకాశం ఉంది.

bombay high court Business News Indian Business Tycoon Mumbai News Philanthropy Ratan Tata Ratan Tata Legacy Ratan Tata Will Tata Sons Tata Trust

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.