Today News : Railways – గుంతకల్లు – నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు

Read Time:  1 min
Railways - గుంతకల్లు - నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు
Railways - గుంతకల్లు - నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు
FONT SIZE
GET APP

గుంతకల్లు Railway : ప్రస్తుతం వారానికి నాలుగు రోజుల పాటు రేణిగుంట హజరత్ నిజామొద్దీన్-రేణిగుంట మద్య తిరుగుతున్న నెంబర్ 00761/62 దూద్ దురంతో ప్రత్యేక రైలు సర్వీసులకు, ప్రజల సౌకర్యార్థం అదనంగా ప్రయాణికుల బోగీలను జతచేసి గుంతకల్లు-నిజామొద్దీన్-గుంతకల్లు మద్య మిక్స్డ్ రైలుగా నడిపేందుకు సంబంధించిన ప్రతిపాదనలను దక్షిణ మద్య రైల్వే, రైల్వే బోర్డుకు పంపింది. దేశ రాజధాని ఢిల్లీవాసుల సౌకర్యార్థం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రేణిగుంట- నిజామొద్దీన్ల మద్య 10 పాలట్యాంకర్లు, మూడు పార్సల్ వ్యాన్లు, గార్డు బోగీలతో కలిపి మొత్తం 14 బోగీల ఫార్మేషన్తో దూద్ దురంతో ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు (Express train) తిరుగుతుంది. ఈ రైలు సర్వీసుల ద్వారా చిత్తూరు మిల్క్ డైరీ ఉత్పత్తి చేసే పాలను హజరత్ నిజామొద్దీన్కు రవాణా చేస్తోంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, రైల్వే డివిజన్ పరిధిలోని గుంతకల్లు, ధర్మవరం, పాకాల, తిరుపతి, రేణిగుంట, విజయవాడ, బల్హార్హాల మీదుగా హజరత్ నిజామొద్దీన్ వరకు అదనంగా మరో 10ప్రయాణికుల బోగీలను జతచేసి మొత్తం 24బోగీలతో దూద్ దురంతో మిక్స్డ్ రైలుగా నడిపేందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసామన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/single-window-permits-for-ganesh-festivals/andhra-pradesh/534349/

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.