Rahul Gandhi: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాహుల్ గైర్హాజరు..బీజేపీ మండిపాటు

Read Time:  1 min
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాహుల్ గైర్హాజరు..బీజేపీ మండిపాటు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాహుల్ గైర్హాజరు..బీజేపీ మండిపాటు
FONT SIZE
GET APP

79వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హాజరుకాకపోవడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ అంశంపై బీజేపీ(BJP) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాహుల్ గాంధీ ఒక ‘పాకిస్థాన్ ప్రేమికుడు’ అని, ఆయనకు జాతీయ ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమాలపై గౌరవం లేదని ఘాటుగా విమర్శించింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన ప్రధాన వేడుకలకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దూరంగా ఉన్నారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్రంగా స్పందించారు. “రాహుల్ గాంధీ ఒక పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడు. జాతీయ పర్వదినం రోజున కూడా ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. దేశ వ్యతిరేక శక్తులతో సమావేశం కావడానికి ఆయనకు సమయం ఉంటుంది కానీ, దేశం గర్వపడే వేడుకల్లో పాల్గొనడానికి మాత్రం తీరిక ఉండదు” అని ఆయన ఆరోపించారు.

Rahul Gandhi: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాహుల్ గైర్హాజరు..బీజేపీ మండిపాటు
Rahul Gandhi: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాహుల్ గైర్హాజరు..బీజేపీ మండిపాటు

రాహుల్ తీరును తప్పుబట్టిన సుధాన్షు త్రివేది

బీజేపీ ఎంపీ, మరో అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది కూడా రాహుల్ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యతిరేక ధోరణులు ప్రదర్శించడం కొత్తేమీ కాదని, ఇది వారి చరిత్రలోనే ఉందని అన్నారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న సందర్భాలను అవమానించడం ద్వారా రాహుల్ గాంధీ అదే పరంపరను కొనసాగిస్తున్నారని విమర్శించారు. అయితే, రాహుల్ గాంధీ తన పార్లమెంట్ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమంలో పాల్గొనేందుకే ఢిల్లీ వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సమాచారం. అయినప్పటికీ, జాతీయ వేడుకకు ఆయన గైర్హాజరు కావడంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది.


రాహుల్ గాంధీ యాత్ర పేరు ఏమిటి?

భారత్ జోడో న్యాయ్ యాత్ర (అక్షరాలా ‘జస్టిస్ మార్చ్’), సాధారణంగా న్యాయ్ యాత్ర (అక్షరాలా ‘జస్టిస్ మార్చ్’) అని పిలుస్తారు, ఇది భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఒక ఉద్యమం, ఇది జనవరి 14, 2024న మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమై మార్చి 16, 2024న భారతదేశ తూర్పు-పశ్చిమ దిశలో విస్తరించి ముంబైలో ముగిసింది.

రాహుల్ గాంధీ బ్యాక్ గ్రౌండ్?

రాహుల్ గాంధీ (జననం 19 జూన్ 1970) రాజకీయ నాయకుడు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. ఆయన ముత్తాత భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన అమ్మమ్మ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/darshan-prajwal-miss-independence-day-celebrations-in-jail/national/530644/

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.