📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam: పహల్గాం నేరస్థులకు శిక్ష పడాల్సిందే..క్వాడ్‌ నేతలు

Author Icon By Vanipushpa
Updated: July 2, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ పాక్‌లను ఉద్దేశిస్తూ ఉగ్ర బాధితులను, నేరస్థులను ఒకేలా చూడకూడదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌(Indian Foreign Minister Jaishankar) వ్యాఖ్యానించారు. భారత్‌(India)కు తన ప్రజలను ఉగ్రవాదం నుంచి కాపాడుకునే హక్కు ఉందని క్వాడ్ దేశాల కూటమి అర్థం చేసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు జైశంకర్‌ తెలిపారు. వాషింగ్టన్‌(Washington)లో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశానికి జై శంకర్‌ హాజరయ్యారు.

ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవసరం: జైశంకర్

ప్రపంచ సవాళ్లను అధిగమించడంలో క్వాడ్‌ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడంపై అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ విదేశాంగ మంత్రులతో విస్తృత చర్చలు జరిపారు. భారత్‌లో నవంబర్‌లో జరిగే క్వాడ్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ఎజెండాపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జైశంకర్, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని క్వాడ్‌ దేశాలకు సూచించారు. భారత్ తీసుకున్న ఆపరేషన్‌ సిందూర్‌ నిర్ణయాన్ని గౌరవిస్తుందని ఆశించారు. సముద్ర డొమైన్, లాజిస్టిక్స్, విద్య, రాజకీయ సమన్వయం వంటి అంశాల్లో క్వాడ్ గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు.

Pahalgam: పహల్గాం నేరస్థులకు శిక్ష పడాల్సిందే..క్వాడ్‌ నేతలు

పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి కొమ్ముకాస్తోందా?
“ఇటీవలి అనుభవాల దృష్ట్యా ఉగ్రవాదం గురించి ఒక మాట చెబుతున్నా. ఉగ్రవాదం పట్ల ప్రపంచం జీరో టోలరెన్స్‌ను ప్రదర్శించాలి. బాధితులు, నేరస్థులను ఎప్పుడూ సమానంగా చూడవద్దు. ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంది. మేము ఆ హక్కును ఉపయోగిస్తాము. మా క్వాడ్ భాగస్వాములు దానిని అర్థం చేసుకుని అభినందిస్తారని మేము ఆశిస్తున్నాము” అని జైశంకర్ తెలిపారు. అయితే ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారికి త్వరగా శిక్ష పడాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు క్వాడ్ నేతలు. జైశంకర్ వ్యాఖ్యలు పరోక్షంగా పాకిస్థాన్ ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తోందన్న అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. “బాధితులను, నేరస్థులను ఒకేలా చూడరాదు” అనే వ్యాఖ్యల ద్వారా భారత్ పాక్‌ను ఉద్దేశించి గట్టిగా హెచ్చరించింది. క్వాడ్ భాగస్వామ్యంలో సముద్ర భద్రత, విద్య, లాజిస్టిక్స్ మరియు రాజకీయ సమన్వయ అంశాల్లో గణనీయమైన పురోగతి నమోదైందని జైశంకర్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ నిర్ణయాన్ని కూడా క్వాడ్ గౌరవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలన్నీ ఉత్తుత్తివే – జైశంకర్ స్పందన
మరోవైపు, వాణిజ్య అవకాశాలను చూపించి భారత్‌-పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ చేసేలా వారిపై ఒత్తిడి తీసుకువచ్చానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఉత్తుత్తివేనని జైశంకర్‌ కొట్టిపారేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ చర్చలు జరిపినప్పుడు తాను ఆ గదిలోనే ఉన్నానని సోమవారం న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, “భారత్-పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ చేసేందుకు తన వాణిజ్య ఒత్తిడి ఉపయోగించానని” చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ ఘాటు స్పందన చేశారు.

Read Also: Top Billionaires : న్యూయార్క్ లో టాప్ బిలియనీర్స్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu India Pakistan terror stance India Russia Ukraine Quad diplomacy Jayashankar on Trump remarks Jayashankar Quad speech Latest News in Telugu Operation Sindoor Quad support Pahalgam Terror Attack Paper Telugu News Quad condemns terrorism Quad foreign ministers meet Telugu News online Telugu News Paper Telugu News Today terrorism zero tolerance Quad US Australia Japan India terror statement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.