📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Narendra Modi: ఏప్రిల్ 24న బీహార్‌ పర్యటనకు ప్రధాని మోదీ

Author Icon By Anusha
Updated: April 13, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 24న బీహార్‌కు పర్యటనకు వస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సీఎం అభ్యర్ధిగా నితీష్‌ కుమార్ పేరు ప్రకటిస్తారా? లేక సస్పెన్స్‌ కొనసాగిస్తారా? నితీష్‌ రాజకీయ జీవితం ముగిసిందని విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో మోదీ ఏం చెబుతారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ఇప్పటికే బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏప్రిల్ 24న బీహార్‌కు వస్తున్నారు. మధుబనిలోని భౌదాగరి వద్ద ఉన్న విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు, అనేక ముఖ్య పథకాలను ప్రకటించనున్నారు. దాదాపు 2 నెలల్లో ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటించడం ఇది రెండవసారి.బీహార్‌లో మరోసారి ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే తమిళనాడులో పళనిస్వామి నేతృత్వం లోనే ఎన్నికల్లో పోటీ చేస్తామన్న బీజేపీ నాయకత్వం బీహార్‌ విషయంలో ఎలాంటి ప్రకటన చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తారా? లేక ఎన్నికల తరువాతే సీఎంని నిర్ణయిస్తామని అంటారా? ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

అసెంబ్లీ ఎన్నికల 

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. రాహుల్‌ డైరెక్షన్‌ను బీహార్‌ కాంగ్రెస్‌ కూడా పోరుబాట పట్టింది. నిరుద్యోగులకు న్యాయం పేరుతో భారీ ఆందోళనలు చేపట్టింది. దీంతో విపక్షాలకు మోదీ ఎలా కౌంటర్‌ ఇస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.అయితే మోదీ బీహార్‌ పర్యటనలో సీఎం అభ్యర్ధిపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. మోదీ పర్యటనపై ఏర్పాట్ల కోసం ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్‌ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు బీహార్‌ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. వికసిత్‌ బీహార్‌ ఎన్డీఏ తోనే సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగాల విషయంలో విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నితీష్‌కుమార్‌ ఐదేళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నితీష్‌ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతోంది. ఎన్డీఏ పాలనలో బీహార్‌ దూసుకెళ్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించామని సామ్రాట్ చౌదరి తెలిపారు. 2030లో వికసిత్‌ బీహార్‌ లక్ష్యంగా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అన్నారు.

బీహార్‌లో పర్యటన

బీహార్‌ ఎన్డీఏ కూటమి సమావేశానికి బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ కీలక నేతలు హాజరయ్యారు. మధుబనిలో మోదీ మీటింగ్‌ను సక్సెస్‌ చేస్తామన్నారు ఎంపీ శాంభవి చౌదరి. ప్రధాని తొలిసారి బీహార్‌కు రావడం లేదు. బీహార్‌కు ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో భాగల్పూరు వచ్చారు. ఇప్పుడు మధుబని వస్తున్నారు. ఆయన సభను సక్సెస్‌ చేయడానికి ఎన్డీఏ పార్టీల సమావేశం జరిగిందని ఎంపీ శాంభవి చౌదరి స్పష్టం చేశారు.

Read Also: Tahawwur Rana : తహవూర్ రాణా అడిగిన వస్తువులు ఇవే..

#BiharElections #BiharPolitics #ModiInBihar #narendramodi #NitishKumar Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.