📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

వచ్చే వారం పీఎం కిసాన్ డబ్బులు విడుదల

Author Icon By Vanipushpa
Updated: February 21, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 19వ విడత డబ్బు విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. ప్రధాని మోదీ దేశంలోని రైతుల ప్రజలకు సహాయం కోసం వాస్తవానికి దీనిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
24న బీహార్‌లోని భాగల్పూర్ నుంచి విడుదల
వచ్చే వారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్‌లోని భాగల్పూర్ నుంచి నిధులను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఏటా రూ.6,000 డీబీటీ బెనిఫిట్ కింద నేరుగా ఖాతాలో జమచేస్తున్న సంగతి తెలిసిందే. దీనికింద దేశంలోని అర్హులైన రైతులందరికీ ప్రతి 4 నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు దఫాలుగా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ నిధులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా బ్యాంక్ అకౌంట్లలోకి జమచేయబడుతున్న సంగతి తెలిసిందే.


రైతులకు eKYC తప్పనిసరి
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమచేయబడతారు. పీఎం కిసాన్ లో నమోదైన రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించటం ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. స్కీమ్ బెనిఫిట్స్ పొందటానికి సదరు వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. తక్కువ భూమి కలిగిన రైతై ఉండాలి. నెలకు పెన్షన్ రూపంలో రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉండకూడదు.
రైతుల ఆధార్ కార్డు తప్పనిసరి
పిఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తాన్ని అందుకోవడానికి లబ్దిదారుడు రైతుల ఆధార్ కార్డు తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడి ఉండాలి. ఈ పథకాన్ని పొందేందుకు eKYC, యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అవసరం. ఈ ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. జాబితాలోని పేరును తనిఖీ చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను పూరించి రిపోర్ట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu money will be released next week Paper Telugu News PM Kisan Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.