విమాన ప్రమాదం బాధలు.. రూ.కోటి పరిహారంపై బాధితుల ఆవేదన
అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Plane Crash) దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపిన ఘటనగా మారింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు టాటా గ్రూప్, ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారాన్ని ప్రకటించినప్పటికీ.. ఆ మొత్తాన్ని తీసుకునే స్థితిలో వారు లేరు. ఎందుకంటే, ఆ ఆర్థికసాయం వారి ప్రాణప్రియులను తిరిగి తీసుకురాలేదు. వారి బాధను తీర్చలేకపోయింది. ఆ క్షణంలో ఆ నిండు జీవితం ఆగిపోవడం, వారి కలలు చెల్లాచెదురవడం అనేది ప్రతి ఒక్కరినీ కడుపు మండేలా చేస్తోంది.
“మా నాన్నను తిరిగి తీసుకువస్తే వారికి రెండు కోట్లు ఇస్తాను..”
ఈ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయిన ఫాల్గుణి అనే మహిళ స్పందన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె చెప్పిన ఒక్క మాట.. “మా నాన్నను తిరిగి తీసుకువస్తే వారికి రెండు కోట్ల రూపాయలు ఇస్తాను” అనే మాట వినగానే, ఏ గుండె అయినా హలించేలా ఉంది. “ఆయన ఎప్పుడూ ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించేవారు. మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు నాన్న అవసరం. నాకు ఆయన ప్రేమ కావాలి. ఆ కోటి రూపాయలు నా నాన్నను తిరిగి తెస్తాయా?” అంటూ ఆమె కన్నీటి మధ్య మాట్లాడింది. ఫాల్గుణి మాటలు వినే ప్రతిఒక్కరికీ గుండె గుబుడు గుబుడు మంటోంది. ఇది పాశవికత కాదు, నిర్లక్ష్యం వల్ల చోటుచేసుకున్న మానవ నష్టమని ఆమె తేల్చి చెప్పింది.

బీజే మెడికల్ కాలేజీ వద్ద ఆర్తనాదాలు.. డీఎన్ఏ పరీక్షలతో మృతుల గుర్తింపు
Plane Crash: మృతదేహాల గుర్తింపు కోసం బంధువులు డీఎన్ఏ నమూనాలు ఇస్తుండగా, బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సివిల్ ఆసుపత్రి అధికారులు శుక్రవారం నాటికి 219 మంది బంధువుల నుంచి రక్త నమూనాలను సేకరించినట్లు తెలిపారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. “చాలా మంది బంధువులు నమూనాలు అందించారు. మృతదేహాల అవశేషాల డీఎన్ఏ విశ్లేషణ కూడా జరుగుతోంది. డీఎన్ఏ సరిపోలిన తర్వాత గుర్తింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాం” అని ఓ అధికారి వివరించారు. ఈ డీఎన్ఏ విశ్లేషణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 48 నుంచి 72 గంటల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పరిహారం కాదు.. బాధితులకు న్యాయం కావాలి
పరిహారం పేరుతో లక్షలాది రూపాయలు ప్రకటించినా, అది బాధితుల మనస్థితిని మెరుగుపరచదు. వారి శోకాన్ని తొలగించదు. ప్రమాదానికి కారణమైన వారు ఎవరు? ఎందుకు విమానం ఆ స్థాయిలో విఫలమైందో? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలన్నది ఇప్పుడు ప్రథమ ఆశయం కావాలి. వాణిజ్య విమానయానంలో ప్రాణాలు ముఖ్యమా? లాభాలా? అనే చర్చ ఇప్పటికైనా మొదలవాలి.
Read also: Flight Crash: విమాన ప్రమాదం.. చెట్టుకింద నిద్రిస్తున్న చిన్నారి మృతి