📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు

Author Icon By Vanipushpa
Updated: February 7, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు క్యూ క‌డుతున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఈ ప‌విత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు దాయాది పాకిస్థాన్ నుంచి 68 మంది హిందువులు కూడా ప్ర‌యాగ్‌రాజ్ వ‌చ్చారు. త్రివేణి సంగమంలో ప‌విత్ర స్నానాలు ఆచ‌రించారు. అనంత‌రం అక్క‌డి ఘాట్‌ల‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాము సింధ్ ప్రావిన్స్ నుంచి వ‌చ్చామ‌ని చెప్పారు. జీవితంలో ఒక్క‌సారి మాత్ర‌మే వచ్చే ఈ ప‌విత్ర సంద‌ర్భాన్ని మిస్ చేసుకోకూడ‌ద‌నే ఉద్దేశంతో ఇండియాకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

ఈ మ‌హత్త‌ర కార్య‌క్ర‌మం ద్వారా హిందు మ‌తం గొప్ప‌త‌నాన్ని తొలిసారిగా మ‌రింత లోతుగా అర్థం చేసుకునే అవ‌కాశం ద‌క్కింద‌న్నారు. హ‌రిద్వార్ వెళ్లి త‌మ పూర్వీకుల అస్థిక‌ల్ని గంగ‌లో క‌లిపామ‌ని వారు చెప్పారు. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందంటూ పాక్ హిందువులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాగా, గ‌త నెల 13న ప్రారంభ‌మైన మ‌హా కుంభమేళా ఈ నెల 26 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. 45 రోజుల పాటు జ‌రిగే కుంభ‌మేళాకు దాదాపు 40 కోట్ల మంది వ‌ర‌కు భ‌క్తులు రావొచ్చ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే 30 కోట్ల‌కు పైగా భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించిన‌ట్లు యూపీ స‌ర్కార్ వెల్ల‌డించింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu india Kumbhamela 2025 Latest News in Telugu Pakistan Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.