భారతదేశం మరోసారి ఉగ్రవాదానికి ధీటుగా స్పందించింది. ఈసారి పాకిస్థాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయం విషయంలో గట్టిగా స్పందించింది. IMF పాకిస్థాన్కు ప్రతిపాదించిన 1.3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీపై భారత్ ఓటింగ్కు దూరంగా ఉండటం దేశ వైఖరిని స్పష్టం చేస్తోంది.భారత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్న దానికీ గట్టి కారణాలున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చిత్తశుద్ధిని మరోసారి నిరూపించింది.దీంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్పై గట్టి ప్రతీకారం తీర్చుకుంది.ఈ నేపథ్యంలోనే IMF సమావేశంలో పాకిస్థాన్కు ఎలాంటి ఆర్థిక సాయం అవసరం లేదని భారత్ అభిప్రాయపడింది.వాషింగ్టన్లో జరిగిన ఈ సమావేశంలో భారత్ స్పష్టంగా చెప్పింది – పాకిస్థాన్ గతంలో ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసింది. IMF పెట్టే నిబంధనలు పాటించడంలో పాక్ పూర్తిగా విఫలమైందని పేర్కొంది.వాస్తవానికి ఈ రుణాలు పౌర అవసరాల కోసం ఇవ్వబడతాయి. కానీ పాకిస్థాన్ వాటిని సైనిక నిఘా కార్యకలాపాలకు, ఉగ్రవాద మద్దతు చర్యలకు వినియోగిస్తోందని భారత్ ఆరోపించింది.భారత గడ్డపై దాడులు చేయడంలో పాలుపంచుకునే లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలకు పాకిస్థాన్ నిరంతరం మద్దతు ఇస్తోందని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని IMF ముందు ఉంచడం ద్వారా, భారత్ తన భద్రతపై ఎంత తీవ్రంగా భావిస్తోంది అన్నది ప్రపంచానికి తెలిసింది.
భారత్ ఒక్కటే కాదు, చాలా దేశాలు ఇప్పుడు పాకిస్థాన్పై నిఘా పెంచాలని భావిస్తున్నాయి. ప్రత్యేకించి IMF లాంటి ఆర్థిక సంస్థలు ఎవరికి ఎలా సాయం చేస్తాయన్నదానిపై నైతిక భాద్యత తీసుకోవాల్సిన సమయం వచ్చింది.పాక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయాన్ని భారత్ బలంగా వ్యక్తం చేసింది. అలాంటి దేశానికి మరోసారి నిస్సారంగా డబ్బులు ఇవ్వడం అర్థవంతం కాదని, ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది.ఈ సందర్భంలో భారత్ తీసుకున్న నిర్ణయం కేవలం రాజకీయ నిర్ణయం కాదు. ఇది దేశ భద్రతను, ప్రజల భవిష్యత్తును కాపాడే విధంగా తీసుకున్న వ్యూహాత్మక ఆలోచన.పాకిస్థాన్ పట్ల అంతర్జాతీయ స్థాయిలో ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని, భారత్ మరోసారి గుర్తు చేసింది. ఈ రకమైన స్పష్టమైన, ధైర్యవంతమైన వైఖరులు భారత స్థానాన్ని అంతర్జాతీయంగా మరింత బలపరుస్తాయి.
Read Also : Truck Support : కార్గిల్ వార్ సమయంలో వెయ్యి ట్రక్కులు సైన్యానికి అప్పగించిన ఏఐటీఎంసీ