పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహం నెలకొంది.భారత ప్రభుత్వం దీన్ని చిన్న విషయంగా తీసుకోలేదు.తక్షణమే ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది.ఈ ఆపరేషన్ ద్వారా పాక్ ఉగ్రవాద స్థావరాలపై గట్టి దెబ్బ కొట్టింది.దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు.భారత సైన్యం తీసుకున్న ఈ ధైర్యవంతమైన చర్యలకు దేశ ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. దేశం కోసం పనిచేస్తున్న జవాన్లకు ప్రతి ఒక్కరు తమవంతు సాయం చేయాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (AI MTC) ముందుకు వచ్చింది.వారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

AI MTC రాష్ట్ర అధ్యక్షుడు సీఎల్ ముకాఠి మాట్లాడుతూ, “మధ్యప్రదేశ్లో రిజిస్టర్ అయిన 7.5 లక్షల ట్రక్కులను భారత సైన్యానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నాం” అన్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.ఇటువంటి అత్యవసర సమయాల్లో దేశ రక్షణ కోసం మా వాహనాలను ఉచితంగా అందించేందుకు సిద్ధమన్నారు. సరిహద్దుల్లో జవాన్లు చూపిస్తున్న ధైర్యమే ప్రజలకు రక్షణ కవచం అని స్పష్టంగా తెలిపారు. ఇది వారి సేవలకు గౌరవంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఇది ఏదో ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు.
ముకాఠి చెప్పినట్టు, 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా సుమారు వెయ్యి ట్రక్కులు ఆర్మీకి అందజేశారు.ఆ అనుభవంతో ఈసారి మరింత విస్తృతంగా ముందుకు వచ్చారు.ఇది దేశభక్తికి నిదర్శనం. మాటలు కాదు, కార్యరూపం ఇదే. సైన్యం కేవలం యుద్ధమే కాదు, సాధారణ సమయంలోనూ సామాన్య ప్రజల కోసం ఎన్నో సేవలు చేస్తుంది. ఇప్పుడు ఆ సేవలకు ప్రతిఫలం ఇచ్చే సమయం ఇది.పాక్కు గట్టి హెచ్చరిక ఇచ్చిన ఆపరేషన్ సిందూర్, ఇప్పుడు ప్రజల సమర్ధనతో మరింత శక్తివంతమవుతోంది. AI MTC లాంటి సంస్థలు ముందుకు రావడం చూస్తే, దేశం ఒక్కటిగా ఉందన్న భావన మరింత బలపడుతోంది.ట్రక్కుల్లాంటి వనరులు, యుద్ధ సమయంలో కీలకం. సరకు రవాణా, సైనికుల తరలింపు, మందుగుండు సామాగ్రి సరఫరా కోసం ఇవి అవసరం. AI MTC తీసుకున్న నిర్ణయం దేశానికి సాయంగా నిలిచే అద్భుతమైన సూచన.దేశ భద్రత కోసం ప్రతి పౌరుడి భాగస్వామ్యం ముఖ్యం. జవాన్లకు పక్కన నిలబడేలా, ప్రతి ఒక్కడూ ఏదో ఒక విధంగా సహకరించగలడు. AI MTC దీన్ని చేసి చూపించింది.
Read Also : Defence Minister : త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ