Operation Sindoor: ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రతీకార దాడులు

Read Time:  1 min
Operation Sindoor
Operation Sindoor
FONT SIZE
GET APP

గతేడాది మే నెలలో జరిగిన యుద్ధ సమయంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో కీలక సైనిక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌తో పాటు పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించింది. భారత వాయుసేన క్షిపణులు, డ్రోన్లతో పాక్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి భారీ నష్టం కలిగించింది.

Read Also:Tariffs Warning: రష్యా చమురు కొనుగోళ్లపై US హెచ్చరిక

Operation Sindoor

కీలక ఎయిర్‌బేస్‌లు ధ్వంసం

ఈ ఆపరేషన్‌లో(Operation Sindoor) 10కిపైగా పాక్ ఎయిర్‌బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయని సమాచారం. ముఖ్యంగా మే 10న భోలారి ఎయిర్‌బేస్‌పై జరిగిన మిస్సైల్ దాడిలో అత్యంత కీలకమైన SAAB 2000 ‘ఎరీఐ’ (Erieye) నిఘా విమానం ధ్వంసమైంది. నూర్ ఖాన్, చక్లాలా, రఫికీ, రహీం యార్ ఖాన్, సుక్కూర్, మురీడ్, నయాచోర్ వంటి ప్రధాన వైమానిక స్థావరాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.

ఇప్పటికీ కొనసాగుతున్న మరమ్మతులు

ఈ దాడుల వల్ల పాక్ వైమానిక శక్తికి పెద్ద దెబ్బ పడిందని, అనేక ఎయిర్‌బేస్‌లకు ఇప్పటికీ మరమ్మతులు జరుగుతున్నాయని రక్షణ వర్గాల సమాచారం వెల్లడిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.