हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఇంటర్నెట్ నెటిజన్లకు కేంద్రం హెచ్చరిక

Ramya
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఇంటర్నెట్ నెటిజన్లకు కేంద్రం హెచ్చరిక

ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం అప్రమత్తం: ఇంటర్నెట్

దేశ భద్రతా పరంగా కీలకమైన ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్ర ప్రభుత్వం అంతర్గత భద్రతా అంశాలపై మరింత అప్రమత్తమవుతోంది. సైనిక కార్యకలాపాలకు అనుకూలంగా దేశంలోని ప్రజలు ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ&బీ) ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశాయి.

ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు తమ ఆన్‌లైన్ ప్రవర్తనలో జాగ్రత్తలు పాటించాలని ఐటీ శాఖ పేర్కొంది. ఈ సందేశాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా ప్రజలతో పంచుకుంది. “క్లిష్టమైన ఆన్‌లైన్ భద్రతా హెచ్చరిక. సైబర్ భద్రతా జాగ్రత్తలను ఎల్లప్పుడూ పాటించండి. వలల్లో లేదా తప్పుడు సమాచారంలో  చిక్కుకోవద్దు. దేశభక్తితో, అప్రమత్తంగా, సురక్షితంగా ఉండండి,” అని పేర్కొంది.

operation sindoor
operation sindoor

ఆన్‌లైన్‌లో పౌరుల పాత్రపై స్పష్టమైన దిశానిర్దేశం: ‘చేయాల్సినవి – చేయకూడనివి’

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రజల ఆన్‌లైన్ ప్రవర్తనపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దేశానికి సహకరించేలా సమాచారాన్ని వినియోగించాలని, అప్రమత్తతతో వ్యవహరించాలని కేంద్రం కోరుతోంది.

చేయాల్సినవి:

అధికారిక వనరుల నుండి వచ్చిన సమాచారం మాత్రమే పంచుకోవాలి. హెల్ప్‌లైన్ నంబర్లు, ధృవీకరించిన సహాయక చర్యల వివరాలను సరిచూసి ప్రచారం చేయాలి. అనుమానాస్పద సమాచారాన్ని ఇతరులకు పంపేముందు దాని నిజానిజాలను ధృవీకరించాలి. నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు నివేదించాలి.

చేయకూడనివి:

సైనిక దళాల కదలికలకు సంబంధించి ఎటువంటి సమాచారం పంచుకోకూడదు.

ధృవీకరించని సమాచారాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా తప్పుడు ప్రచారానికి వేదికవ్వకూడదు.

మత ఘర్షణలకు, హింసకు దారితీసే పోస్టులు, మెసేజులను పూర్తిగా నివారించాలి.

ఈ సూచనల అమలుకు పౌరుల సహకారం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం నివేదించేందుకు కేంద్రం వాట్సాప్ నంబర్ 8799711259, ఈమెయిల్ [email protected] కూడా అందుబాటులో ఉంచింది.

ఓటీటీలు, మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు

పౌరులకే కాకుండా, పౌరులను ప్రభావితం చేసే డిజిటల్ మీడియా వేదికలపై కూడా కేంద్రం కఠినంగా స్పందించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, స్ట్రీమింగ్ సర్వీసులు, ఇతర మధ్యవర్తిత్వ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

“జాతీయ భద్రతకు భంగం కలిగించేలా ఉన్న విదేశీ కంటెంట్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా పాకిస్థాన్‌కు చెందిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర డిజిటల్ మీడియా కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలి” అని ఐ&బీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

ఈ ఆదేశాలు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత అయినా, ఉచితంగా అందుబాటులో ఉన్నా వర్తిస్తాయి. ప్రతి డిజిటల్ కంటెంట్ సృష్టికర్త, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ తన సోషల్ బాధ్యతను గుర్తించి ఈ ఆదేశాలను పాటించాలని కేంద్రం ఆదేశించింది. దేశ భద్రత కోసం మీడియాలో ప్రసారం అయ్యే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది.

జాతీయ భద్రతకు తోడుగా డిజిటల్ బాధ్యత

దేశం క్లిష్టమైన దశలో ఉన్నపుడు, ప్రతి పౌరుడు, ప్రతి మీడియా సంస్థ తన పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు ప్రజల భద్రత కోసం మాత్రమే కాకుండా, దేశ సమగ్రతను కాపాడేందుకు కూడా కీలకంగా మారాయి. తప్పుడు ప్రచారాన్ని అరికట్టడం, సైనిక సమాచారాన్ని పంచకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేవి ప్రతి పౌరుని కర్తవ్యంగా మారాయి. డిజిటల్ ఇండియాలో భాగమైన ప్రతి ఒక్కరూ ఈ మార్గదర్శకాలను గౌరవించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

Read also: Ishaq Dar: భారత్ ఇక్కడ ఆగిపోతే మేము కూడా ఆగిపోతాం: పాక్ విదేశాంగ శాఖ మంత్రి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870