Bihar : నాగుపామును కొరికి చంపిన ఏడాది బాలుడు

Read Time:  1 min
Govinda : నాగుపామును కొరికి చంపిన ఏడాది బాలుడు
Govinda : నాగుపామును కొరికి చంపిన ఏడాది బాలుడు
FONT SIZE
GET APP

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా (West Champaran district of Bihar)లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఏడాది వయసున్న గోవింద అనే బాలుడు (A one-year-old boy named Govinda) నాగుపామును తన పళ్లతో కొరికి చంపేశాడు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.బేతియా పట్టణ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ ఇంటి దగ్గర కట్టెలు సేకరిస్తోంది. ఆ సమయంలో ఆమె ఏడాది కుమారుడు గోవింద ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక నాగుపాము అక్కడికి చేరి బాలుడి చేతికి చుట్టుకుంది.

Govinda : నాగుపామును కొరికి చంపిన ఏడాది బాలుడు
Govinda : నాగుపామును కొరికి చంపిన ఏడాది బాలుడు

పామును కొరికి చంపిన గోవింద

పాము చేతికి చుట్టుకున్న వెంటనే గోవింద తన పళ్లతో బలంగా కొరికాడు. దాంతో పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ దృశ్యం చూసిన తల్లి, అమ్మమ్మ భయంతో గాబరిపోయారు.కొద్ది సేపటికే గోవింద స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బేతియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల నివేదిక

వైద్యులు గోవింద ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. బాలుడి శరీరంలో విషం ఏ మాత్రం లేనట్లు నిర్ధారించారు. అతనికి తగిన చికిత్స అందుతున్నట్లు వైద్యులు చెప్పారు.గోవింద పామును కొరికి చంపిన సంఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. చిన్నారి ధైర్యంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Mumbai-Pune : ముంబై-పుణే హైవేపై 20 కార్లు నుజ్జునుజ్జు!

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.