📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అతిషికి కొత్త సీఎం రేఖా గుప్తా కౌంటర్

Author Icon By Vanipushpa
Updated: February 21, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మా ప్రభుత్వం ఏర్పడి ఒక్కరోజు కూడా గడవలేదని, కానీ అప్పుడే విమర్శలు చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మండిపడ్డారు. కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయని, ఇన్నేళ్లు ఏం చేశారో చూసుకోవాలని హితవు పలికారు. కానీ తాము పీఠం ఎక్కి ఒకరోజు కూడా కాలేదు, తమపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు.
రూ.10 లక్షల మేరకు వైద్య సాయం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి రోజే తాము కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆయుష్మాన్ భారత్ యోజనను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. దీంతో ప్రజలకు రూ.10 లక్షల మేరకు వైద్య సహాయం అందుతుందని తెలిపారు. ప్రజలకు రూ.10 లక్షల విలువ చేసే వైద్య సహాయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేయలేదని విమర్శించారు.


ప్రశ్నించే హక్కు లేదు
పదమూడేళ్లు ఏమీ చేయని వారికి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీ తన హక్కులన్నింటినీ పొందుతుందని అన్నారు. ముందు మీరు మీ పార్టీ గురించి చూసుకోవాలని హితవు పలికారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఎంతోమంది వీడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో పెడితే అన్ని విషయాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే పథకాన్ని మొదటి కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ మొదటి రోజు దానిని ఉల్లంఘించిందని మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి ఆరోపించారు. అతిషి విమర్శలకు ముఖ్యమంత్రి పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Delhi new CM Rekha Gupta ex cm Atishi Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.