📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

ఛత్తీస్‌గఢ్‌లో అంతుచిక్కని వ్యాధితో 13మంది మృతి

Author Icon By Vanipushpa
Updated: March 6, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామస్థులు గుర్తుతెలియని వ్యాధితో వణికిపోతున్నారు. ఇప్పటివరకు ఆ వ్యాధితో గత నెల రోజుల కాలంలోనే ఆ గ్రామంలో 13 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సుక్మా జిల్లాలోని ధనికోర్తా గ్రామంలో ఈ వింత వ్యాధి ప్రబలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంతుచిక్కని వ్యాధితో ఒకరి తర్వాత ఒకరు ఇలా నెల రోజుల్లోనే 13 ప్రాణాలు పోవడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళలో పడ్డారు. ఇక ఆ విషయం తెలియగానే ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ధనికోర్తా గ్రామానికి మెడికల్ సిబ్బందిని పంపించి.. గ్రామస్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు ఆ మిస్టరీ వ్యాధి ఏంటా అని ఆరా తీస్తున్నారు.

ధనికోర్తా గ్రామంలో వరుసగా చనిపోతున్న వారికి కొన్ని లక్షణాలు ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. బాధితులు చనిపోయే ముందు వరకు కూడా ఛాతీ నొప్పి, నాన్‌స్టాప్‌గా దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లు చెప్పారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ ధనికోర్తా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఈ వ్యాధి బాధితులు ఉన్నారని, వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొంటుండటం మరింత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

సుక్మా జిల్లా ప్రధాన వైద్యాధికారి వివరణ
ఇక ఈ అంతుచిక్కని వ్యాధి గురించి వస్తున్న వార్తలపై సుక్మా జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ మీడియాకు వెల్లడించారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అయితే ఆ ఐదుగురిలో ముగ్గురు వృద్ధాప్య సమస్యలతో చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరి మృతికి గల కారణాలను ఇంకా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం.. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణంగా ఈ వింత వ్యాధితో గ్రామస్థులు చనిపోతున్నట్లు అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మహువా పంట సేకరణ కోసం గ్రామస్థులు రోజు మొత్తం అటవీ ప్రాంతంలోనే ఉంటారని.. అందువల్ల వారు డీహైడ్రేషన్‌కు గురై, అనారోగ్యం బారిన పడుతున్నారని డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ తెలిపారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Chhattisgarh Google News in Telugu kills-13 Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.