📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

రేపు మోదీ సభలో మహిళా పోలీసులతోనే భద్రతా ఏర్పాట్లు

Author Icon By Vanipushpa
Updated: March 7, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందితో కూడిన భద్రతా బృందాన్ని మోహరిస్తామని ఈ రాష్ట్ర మంత్రి తెలిపారు. “అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు గుజరాత్ పోలీసులు ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా, నవ్‌సరిలోని వాన్సీ బోర్సీ గ్రామంలోని హెలిప్యాడ్ వద్దకు ప్రధాని రాక నుంచి కార్యక్రమ వేదిక వరకు మొత్తం భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారు” అని హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి గురువారం తెలిపారు. మహిళా పోలీసు సిబ్బందిలో ఐపీఎస్ అధికారులు, కానిస్టేబుళ్లు ఉంటారని పేర్కొన్నారు.

కేవలం మహిళా భద్రతా సిబ్బంది తోనే సెక్యూరిటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా భారీ ఎత్తున భద్రతా ఏర్పాటు చేస్తారు. ప్రధానిగా ఆయనకు ఉండే హై సెక్యూరిటీ కాకుండా మూడు నాలుగు అంచెల్లో భద్రతా వలయాలు ఏర్పాటు చేస్తారు. మోదీని చూసేందుకు, ఆయన సభకు హాజరయ్యేందుకు చాలా మంది జనం, ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు వస్తారు కాబట్టి వారిని అదుపు చేయడానికి పోలీస్‌ సిబ్బందిని బందోబస్తుగా పెడతారు. అయితే అందులో ఎక్కువ పురుష భద్రతా సిబ్బంది ఉంటారు. కానీ, ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌ ఓ భారీ కార్యక్రమంలో కేవలం మహిళా భద్రతా సిబ్బంది తోనే సెక్యూరిటీని కల్పిస్తున్నారు. అలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

‘లఖ్‌ప్తి దీదీ సమ్మేళన్’ సభ

ప్రధాని మోదీ శుక్ర, శనివారాల్లో గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నాగర్ హవేలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మార్చి 8న వంసి బోర్సి గ్రామంలో జరిగే ‘లఖ్‌ప్తి దీదీ సమ్మేళన్’లో పాల్గొని ప్రసంగిస్తారు. “2,100 మందికి పైగా కానిస్టేబుళ్లు, 187 మంది సబ్-ఇన్స్పెక్టర్లు, 61 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 16 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డీజీపీ ర్యాంక్ అధికారితో సహా అంతా మహిళా పోలీసు సిబ్బంది ఆ రోజు భద్రతను నిర్వహిస్తారు” అని మంత్రి పేర్కొన్నారు. సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి, హోం కార్యదర్శి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Gujarat International Womens Day Latest News in Telugu meeting Narendra Modi Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.