ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూఫీ సంగీత ఉత్సవం జహాన్-ఎ-ఖుస్రావు 2025 రజతోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, దేశ ప్రజలకు ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన ఈ గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జహాన్-ఎ-ఖుస్రో అనుభవానికి భారతీయ మట్టిలో ఓ ప్రత్యేకత ఉందని అన్నారు. “హజ్రత్ అమీర్ ఖుస్రో హిందూస్తాన్ను స్వర్గంతో పోల్చారు. మన దేశం ఓ స్వర్గపు తోట లాంటిది. ఇక్కడ ప్రతి రంగు, ప్రతి సంస్కృతి ప్రతిబింబిస్తుంది.బహుశా అందుకే సూఫీ సంప్రదాయం హిందూస్తాన్కు వచ్చినప్పుడు, అది దాని స్వంత భూమితో అడుగుపెట్టినట్లు అనిపించింది” అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని ప్రశంసలు
ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో సూఫీ సంప్రదాయం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుందని అన్నారు. “సూఫీ సాధువులు కేవలం మసీదులకే పరిమితం కాలేదు. వారు ఖురాన్ అక్షరాలను చదవడంతో పాటు వేదాల పదాలను కూడా విన్నారు. అజాన్ శబ్దానికి భక్తి గీతాల మాధుర్యాన్ని జోడించారు. ఏ దేశ సంస్కృతిని, నాగరికతను అర్థం చేసుకోవాలంటే, ఆ దేశ సంగీతాన్ని పరిశీలించాలి. సంగీతం ద్వారా సంస్కృతి వ్యక్తమవుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
సంస్కృత భాష గొప్పతనం
ప్రధాని మోదీ ఈ సందర్భంగా సంస్కృత భాష గొప్పతనాన్ని ప్రస్తావించారు. “ప్రపంచంలోనే అత్యుత్తమ భాష సంస్కృతం. భారత ఋషులు కేవలం పండితులు మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్తలు కూడా. హజ్రత్ అమీర్ ఖుస్రో భారతదేశ గొప్పతనాన్ని గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించారు” అని అన్నారు.జహాన్-ఎ-ఖుస్రో ఉత్సవం 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఈ 25 ఏళ్లలో ఈ కార్యక్రమం ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకుంది. ఇటువంటి ఉత్సవాలు భారత కళ, సంస్కృతిని నిలిపే గొప్ప వేదికలు” అని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా, తెహ్ బజార్ను సందర్శించే అవకాశం లభించిందని, అక్కడి సాంప్రదాయ కళాకారుల ప్రతిభను దగ్గరగా చూడగలిగానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇక్కడి నేల స్వభావంలో ఏదో ప్రత్యేకత ఉంది. బహుశా అందుకే సూఫీ సంప్రదాయం హిందూస్తాన్కు వచ్చినప్పుడు, అది దాని స్వంత భూమితో అడుగుపెట్టినట్లు అనిపించింది” అని ప్రధాని మోదీ అన్నారు.“
రంజాన్ శుభాకాంక్షలు
“పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది, మీ అందరికీ, దేశవాసులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇటువంటి సందర్భాలు దేశ కళ, సంస్కృతికి ముఖ్యమైనవి. అవి ఓదార్పునిస్తాయి. ఈ జహాన్-ఎ-ఖుస్రో సిరీస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ 25 సంవత్సరాలలో, ఈ కార్యక్రమం ప్రజల మనస్సులలో చోటు సంపాదించుకోవడం ఒక గొప్ప విజయం” అని ప్రధాని మోదీ అన్నారు.