News telugu: Manohar Lal Khattar: విద్యుత్ రంగ సంస్కరణలు, మంత్రుల బృందం సమావేశంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఖట్టర్

Read Time:  1 min
News telugu
News telugu
FONT SIZE
GET APP

హైదరాబాద్: విద్యుత్ రంగ సంస్కరణలు, రుణఉపశమనం, డిస్కామ్లను బలోపేతం చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. ఇందుకుగాను ప్రభుత్వ సంస్థలలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల (Prepaid smart meters) ఏర్పాటును వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. విద్యుత్ పంపిణీ, వినియోగాల సాధ్యతను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడిన మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్) మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ అధ్యక్షతన ఐదవసారి సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కరణలను అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్రాలతో పాటు, నియంత్రణ సంస్థలు సహకార ప్రయత్నాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.

News telugu
News telugu

వినియోగదారులకు విద్యుత్తును అందించడంలో పంపిణీ సంస్థల (Discs) కార్యాచరణ, ఆర్థిక ఆరోగ్యం కీలకమన్నారు. కేంద్ర, రాష్ట్రాలు అమలు చేయబోయే ప్రతిపాదిత ప్రణాళిక పంపిణీ సంస్థల రుణ భారాన్ని తగ్గించి, నమ్మకమైన విద్యుత్ సరఫరాను అందించడంలో వాటి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర ఇంధన శాఖ సహా య మంత్రి శ్రీపాద యెస్సో నాయక్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఇంధన మంత్రులు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pm-modi-mukesh-ambani-wishes-pm-narendra-modi-on-his-birthday/national/549007/

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.