West Bengal: దేశంలో బెంగాలీలను హింసిస్తున్న బీజేపీ..మమతా

Read Time:  1 min
దేశంలో బెంగాలీలను హింసిస్తున్న బీజేపీ..మమతా
దేశంలో బెంగాలీలను హింసిస్తున్న బీజేపీ..మమతా
FONT SIZE
GET APP

బీజేపీ పాలిత రాష్ట్రాలపై పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు వలస వెళ్లిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఉత్తర బంగాల్​లో మమత ఈ మేరకు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉత్తర బెంగాల్ పర్యటనకు వెళ్లే ముందు ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు.

Read Also: Nisha Verma US Senate : పురుషులు గర్భం దాల్చగలరా? యూఎస్ సెనేట్‌లో డాక్టర్‌కు షాక్!

West Bengal: దేశంలో బెంగాలీలను హింసిస్తున్న బీజేపీ..మమతా
West Bengal: దేశంలో బెంగాలీలను హింసిస్తున్న బీజేపీ..మమతా

మరోవైపు, బంగాల్​లో అల్లర్లు ప్రేరేపించడానికి బీజేపీ ప్రణాళికలు వేస్తోందని మమత ఆరోపించారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని వారికి ఇప్పటికే అర్థమైపోయిందన్నారు. అదేవిధంగా బంగాల్​లో కొనసాగుతున్న ఎస్​ఐఆర్​ ప్రక్రియపై కూడా మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఎస్​ఐఆర్​ వల్ల రాష్ట్రంలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఈసీ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని, అప్పుడే ప్రజలు వారిని గౌరవిస్తారని మమత పేర్కొన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యల ప్రకారం, రాబోయే లోక్‌సభ లేదా రాష్ట్ర ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా బీజేపీ బంగాల్‌లో అశాంతిని సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. వలస కార్మికుల అంశాన్ని ఉపయోగించి రాష్ట్రంలో సామాజిక ఉద్రిక్తతలు పెంచాలన్నదే బీజేపీ వ్యూహమని తృణమూల్ వాదన. మొత్తంగా చూస్తే, ఈ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బంగాల్ రాజకీయాల్లో కేంద్ర–రాష్ట్ర ఘర్షణను మరింత తీవ్రతరం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.