Maharashtra: నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

Read Time:  1 min
Maharashtra: నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర (Maharashtra) లోని నాందేడ్‌కు చేరుకున్నారు. ప్రముఖ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షహీదీ సమాగమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అతిథి హోదాలో ఘన స్వాగతం పలికింది. నాందేడ్‌లోని గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఎమ్మెల్యే జయ చవాన్,

Read Also: AP: భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు

ప్రభుత్వ అతిథిగా ఘన స్వాగతం

ఎమ్మెల్సీ రాజార్ కర్, జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ (Guru Teg Bahadur sahib Ji) 350వ షహీదీ సమాగమానికి డిప్యూటీ సీఎం హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు మోదీ మైదాన్ లో నిర్వహించే దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు.

Maharashtra: Pawan Kalyan arrives in Nanded.. given a grand welcome by the government
Maharashtra: Pawan Kalyan arrives in Nanded.. given a grand welcome by the government

కార్యక్రమ అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. బేగంపేటకు ఎయిర్ పోర్టుకు చేరుకొని జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్తారు. సుమారు 10 లక్షల మంది భక్తులు కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అతిథిగా హాజరు కావడం పట్ల జనసేన శ్రేణుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.