📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బీజేపీకి షాకిచ్చిన కేజ్రివాల్ ?

Author Icon By Vanipushpa
Updated: February 7, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వీటిలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఎన్నికలు హోరాహోరీగా జరిగినట్లు తేల్చేశాయి. అలాగే బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని కూడా చెప్పేశాయి. దీంతో కాస్త డీలా పడ్డ ఆప్ అధినేత కేజ్రివాల్.. తిరిగి కౌంటింగ్ రోజు కల్లా పుంజుకోవాలని భావించారో లేక క్షేత్రస్ధాయిలో వాస్తవపరిస్ధితుల ఆధారంగా మాట్లాడారో తెలియదు కానీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు కూడా వెల్లడికాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ప్రయోగించిన ఓ అస్త్రం బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ముఖ్యంగా రేపు ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా బీజేపీ మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్దితి. దీంతో ఆ పార్టీ ఇప్పుడు కేజ్రివాల్ కు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరిస్తోంది.

ఢిల్లీలో 16 మంది ఆప్ అభ్యర్ధులకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు చొప్పున ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ ఇచ్చిందంటూ కేజ్రివాల్ బాంబు పేల్చారు. దీంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందే ఇదో సంచలనంగా మారింది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే హస్తినలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్దితుల్లో బీజేపీ అప్రమత్తమై ఆప్ అభ్యర్ధులతో టచ్ లోకి వెళ్లిందన్న చర్చ మొదలైంది. దీనికి మరింత మసాలా జోడించి కేజ్రివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.కేజ్రివాల్ ఆరోపణలతో ఫలితాలకు ముందే ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ.. ఆయన ఈ ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే కేజ్రివాల్ మాత్రం అన్నీ తెలిసే పక్కాగా ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రేపు ఆప్ గెలిచినా, ఓడిపోయినా, ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ వల్లే అని చెప్పుకునే అవకాశం ఆయనకు లభిస్తోంది.

#telugu News Ap News in Telugu app Arvind Kejriwal Breaking News in Telugu Delhi Elections 2025 Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.