हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Karnataka: కర్ణాటక లో మత ఘర్షణలను ఆపేందుకు స్పెషల్ ఫోర్స్

Anusha
Karnataka: కర్ణాటక లో మత ఘర్షణలను ఆపేందుకు స్పెషల్ ఫోర్స్

కర్ణాటకలోని కోస్తా ప్రాంతాంలో మతపరమైన హత్యలు, ఘర్షణలు ఎక్కువ అయ్యాయి. వీటిని ఎదుర్కునేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది. దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గ ప్రాంతాలను సున్నితమైన జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక యాక్షన్ ఫోర్స్ దళాన్ని(Special Action Force) ఏర్పాటు చేసింది. ఈ దళంలో మొత్తంగా 248 మంది పోలీసు సిబ్బంది ఉంటారు. అలాగే మూడు కంపెనీలు ఉండగా ప్రతి మూడు జిల్లాల్లో ఒక కంపెనీ మోహరిస్తుంది. మూడు కంపెనీలతో ఆ దళం ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి.ఈ ప్రత్యేక యాక్షన్ ఫోర్స్ మత ఘర్షణల వివాదాలపై దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మే 28వ తేదీన జారీ చేసింది కర్ణాటక సర్కారు. మత ఘర్షణల ప్రత్యేక దళంలో మొత్తం 248 మంది అధికారులు ఉంటారు. అందులో ఒక సీనియర్ డీఐజీపీ(DIGP) ర్యాంకు అధికారి కూడా ఉంటారు.

ఏర్పరచడానికి

యాంటీ నక్సల్స్ ఫోర్స్(Anti-Naxal Force) నుంచి 248 మందిని తీసుకోనున్నారు. ప్రస్తుతం యాంటీ-నక్సల్స్ ఫోర్స్ (ఏఎన్ఎఫ్)లో 656 మంది అధికారులు, సిబ్బంది ఉండగా, రాబోయే మూడు సంవత్సరాల్లో ఆ సంఖ్య 376కు తగ్గించనున్నారు. మతపరమైన ఘర్షణలు, ప్రేరేపిత ఘటనలు, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్(Intelligence) సమాచారాన్ని సేకరించడం ఈ ప్రత్యేక దళం తొలి ప్రాధాన్యతగా ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి సామరస్యతను ఏర్పరచడానికి అన్ని వర్గాల నేతలతో చర్చలు నిర్వహించాలని ఆదేశించినట్లు హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర(G.Parameshwara) తెలిపారు.మే 1న మంగళూరులోని బాజ్‌పే సమీపంలో రౌడీ షీటర్, ఒక హత్య కేసు నిందితుడు సుహాస్ శెట్టి హత్య తర్వాత, ద్వేషపూరిత ప్రసంగాలు సహా మతపరమైన నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడంతో యాంటీ నక్సల్స్ ఫోర్స్‌లోని అధికారులు, సిబ్బందితో ఈ స్పెషన్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది హోంశాఖ.

Karnataka: కర్ణాటక లో మత ఘర్షణలను ఆపేందుకు స్పెషల్ ఫోర్స్
Karnataka: కర్ణాటక లో మత ఘర్షణలను ఆపేందుకు స్పెషల్ ఫోర్స్

అవకాశాలు

దక్షిణ కన్నడ జిల్లా నుంచి మతపరమైన సంఘటనలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయని మంత్రి పరమేశ్వర అన్నారు. ఈ జిల్లాలో విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వృద్ధి పరంగా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్న జిల్లా అని మంత్రి తెలిపారు. దక్షిణ కన్నడ(South Kannada) జిల్లాలో మతపరమైన ఘటనలను పూర్తిగా కట్టడి చేసి, శాంతిని నెలకొల్పడానికి తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.

Read Also: Gujarat: ప్రియుడితో పారిపోయేందుకు ఓ భార్య మాస్టర్ ప్లాన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870