📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం

Author Icon By Digital
Updated: April 22, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మాంజి హతం

మావోయిస్టులకు ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పై కేంద్ర బలగాలు దాడులు ముమ్మరం చేసిన తరుణంలో, తాజాగా ఝార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం లాల్పానియా ప్రాంతంలోని లుగు పర్వతాల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ నిర్వహించారు. సమాచారం మేరకు నక్సల్స్ స్థావరంపై చేపట్టిన దాడిలో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు.పోలీసుల ప్రకారం, హతమయ్యిన వారిలో మావోయిస్టు అగ్రనేత ప్రయాగ్ మాంజి అలియాస్ వివేక్ ఉన్నాడు. అతనిపై కోటి రూపాయల రివార్డు ఉందని ఝార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు. అతనితో పాటు జోనల్ కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్ అలియాస్ అవినాష్, సాహెబ్రాం మాంజి అలియాస్ రాహుల్, మహేష్ మాంజీ అలియాస్ మోటా రాంజి, గంగారాం మాంజిలు కూడా మృతులలో ఉన్నారు. అరవింద్‌పై రూ. 25 లక్షలు, సాహెబ్రాం పై రూ. 10 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం

కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు నేత హతం

ఎన్‌కౌంటర్ ప్రాంతం నుండి ఏకే 47 తుపాకి, ఎస్ఎస్ఆర్ తుపాకి, మూడు ఇన్సాస్ తుపాకులు, పేలుడు సామాగ్రి మరియు మావోయిస్టు ప్రచార పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో పోలీసులు ఎలాంటి నష్టం లేకుండా తిరిగారని డీజీపీ తెలిపారు. కొంతమంది నక్సల్స్ గాయపడినట్లు అనుమానం వ్యక్తమవుతున్నదనీ, ప్రాంతవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోందని చెప్పారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై స్పందిస్తూ, మావోయిస్టులు ఆయుధాలను వీడి వెంటనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు. వచ్చే వర్షాకాలం లోపు నక్సల్స్ ప్రభావం ఉండే ప్రాంతాలను పూర్తిగా మావోయిస్టుల నుంచి విముక్తం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర బలగాలు మరియు రాష్ట్ర పోలీస్‌ బలగాలు నిరంతరం కూంబింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు మరో గట్టి హెచ్చరికగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత మాంజి హత్య, మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.

Read More : Donald Trump: నాలుగు నెలల్లోనై ట్రంప్‌కు తగ్గుతున్న ప్రజాదరణ

Bokaro Naxal Encounter CRPF Operation Jharkhand Encounter Maoist Leader Killed Maoist Reward Killed most wanted maoist

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.