Iphone 17 : టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ను పూర్తిగా భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమివ్వడమే కాకుండా, (Iphone 17) దేశాన్ని ప్రీమియం పరికరాల తయారీ హబ్గా మార్చబోతోందని నిపుణులు చెబుతున్నారు.
భారత్లో ఉత్పత్తి పెరగడంతో, యాపిల్కు 20 శాతం దిగుమతి సుంకం నుంచి ఉపశమనం లభిస్తుంది. తమిళనాడు, కర్ణాటకల్లోని ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లలో ఐఫోన్ 17 సిరీస్ ఉత్పత్తి జరగనుంది.
గ్రాంట్ థార్న్టన్ భరత్ నిపుణుడు క్రిషన్ అరోరా మాట్లాడుతూ – “ఈ నిర్ణయం వల్ల భారత్లో ఉద్యోగాలు పెరుగుతాయి, ఎగుమతులు వేగం పొందుతాయి, హై-టెక్ తయారీ రంగంలో దేశం నమ్మకాన్ని సంపాదిస్తుంది. అంతేకాదు, భవిష్యత్లో అమెరికా వంటి దేశాల్లో సుంకాల పెరుగుదల నుంచి యాపిల్ రక్షణ పొందుతుంది” అని తెలిపారు.
అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎల్ఐ పథకం కూడా యాపిల్కు మేలు చేస్తోంది. ఈ పథకం కింద భారత్లో తయారైన ఫోన్లపై 5 ఏళ్లపాటు 4% నుంచి 6% వరకు నగదు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ ప్రోత్సాహకాలు వల్ల 2024-25లో యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు 10 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. 2025 మొదటిార్ధంలోనే ఎగుమతులు గతంతో పోలిస్తే 53% పెరిగి 2.39 కోట్ల యూనిట్లకు చేరాయి.
అయితే, నిపుణుల అంచనాల ప్రకారం, భారత వినియోగదారులకు ఐఫోన్ ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదు. కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి రాయితీలు, తక్కువ ధర భూమి, సులభ పర్యావరణ అనుమతులు అందిస్తూ యాపిల్ తయారీ ప్రణాళికలకు మద్దతుగా నిలుస్తున్నాయి.
Read also :