థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ భూకంపంతో వణికింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు అక్కడికి చేరుకున్నారు. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి భారతీయ దౌత్యాధికారులు, థాయ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అదే విధంగా, ప్రవాస భారతీయులు ప్రధానమంత్రిని ఆహ్వానించారు.అనంతరం బ్యాంకాక్లో థాయ్ రామాయణాన్ని మోదీ తిలకించారు. భారత్ -థాయ్లాండ్ మధ్య ఎన్నో శతాబ్ధాల అనుబంధం ఉందని , దీనికి రామాయణమే నిదర్శనమన్నారు మోదీ. రామాయణాన్ని ప్రదర్శించిన కళాకారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా థాయ్ ప్రధానమంత్రి “ది వరల్డ్ టిపిటక: సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్”ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక దౌత్యం ముఖ్యమైన భాగస్వామ్యానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి థాయ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్ షినవత్ర పవిత్ర గ్రంథం “ది వరల్డ్ టిపిటక: సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్”ను ప్రదానం చేశారు.
శిఖరాగ్ర సమావేశం
2018లో నేపాల్లోని ఖాట్మండులో జరిగిన నాలుగో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్లో జరిగింది. ప్రధాని మోదీకి బహుమానంగా అందించిన ది వరల్డ్ టిపిటక: సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్ పాలీ, థాయ్ లిపిలలో వ్రాయబడిన జాగ్రత్తగా రూపొందించబడిన వెర్షన్ ఇది తొమ్మిది మిలియన్లకు పైగా అక్షరాల ఖచ్చితమైన ఉచ్చారణను నిర్ధారిస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ను 2016లో రాజు భూమిబోల్ అదుల్యదేజ్, రాణి సిరికిట్ 70 సంవత్సరాల పాలనను స్మరించుకునేందుకు థాయ్ ప్రభుత్వం వరల్డ్ టిపిటక ప్రాజెక్ట్లో భాగంగా ప్రచురించింది.
పర్యటన
ప్రధానమంత్రికి టిపిటకను సమర్పించడం భారతదేశం ఆధ్యాత్మిక నాయకత్వానికి, బౌద్ధ దేశాలతో దాని శాశ్వత బంధానికి నిదర్శనం. ప్రధాని మోదీ థాయిలాండ్ పర్యటన సందర్భంగా, ఆ దేశం 18వ శతాబ్దపు రామాయణ కుడ్యచిత్రాల ఆధారంగా ఒక ప్రత్యేక స్టాంపును విడుదల చేస్తుంది.ఈ పర్యటనలో ప్రధాని మోదీ థాయ్లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాతో భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతోపాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. సాయంత్రం బిమ్స్టెక్ సదస్సులో మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో భారత్తో పాటు థాయ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో సాంకేతిక, ఆర్థిక సహకారంపై చర్చించనున్నారు.