📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్

Author Icon By Vanipushpa
Updated: February 19, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని టార్ సెకెండ్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. టీసీఎస్ తర్వాత ఐటీ సేవల రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన కంపెనీ ఇటీవల తన ఉద్యోగులకు వేతన పెంపులకు సంబంధించి ఒక శుభవార్త చెప్పింది. అయితే వేతన పెంపుల రోలవుట్ ప్రక్రియకు ముందుగానే నేడు షాకింగ్ విషయం ఒకటి బయటకు రావటంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే తాజాగా కంపెనీ మార్చి చివరి నాటికి ఉద్యోగులకు వేతన పెంపులను అమలు చేయాలని నిర్ణయించింది. కానీ దీనికి ముందు ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్ విడుదల చేస్తోంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలానికి ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్ విషయంలో భారీగా కోత విధించినట్లు వెల్లడైంది. ఈటీ నివేదిక ప్రకారం కంపెనీ సగటున బోనస్ చెల్లింపును 80 శాతానికి తగ్గించినట్లు తెలిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ డెలివరీ అండ్ సేల్స్ విభాగాల్లో ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని గత త్రైమాసికంతో పోల్చితే 10 శాతం తగ్గించినట్లు వెల్లడైంది.


20 నుండి 40 శాతం తగ్గిన చెల్లింపులు
ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజ సంస్థలో దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నారు. హై పెర్ఫార్మెన్స్ పని సంస్కృతిని నిర్మించాలనే లక్ష్యాలకు అనుగుణంగా బోనస్ చెల్లింపులను కూడా ముగించేటప్పుడు మేము పనితీరు భేదాన్ని కొనసాగించినట్లు కంపెనీ తన ఉద్యోగులకు పంపిన మెయిల్ సారాంశం ద్వారా వెల్లడైంది. ఇదే క్రమంలో గత త్రైమాసికంలో కంపెనీ కొందరు ఉద్యోగులకు 100 శాతం పెర్ఫామెన్స్ బోనస్ అందించగా.. ప్రస్తుతం దీనిలో తగ్గింపుల ద్వారా కంపెనీ పెంచిన వేతనాలకు నిధులను ఆదా చేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ఫిబ్రవరిలో త్రైమాసిక వేరియబుల్ పే విడుదల చేసిన తర్వాత మార్చిలో జీతాల పెంపుదల రోలవుట్ కానుంది. ఈ క్రమంలో వేరియబుల్ వేతనాల విషయంలో సీనియర్ స్థాయి ఉద్యోగులు 20 నుండి 40 శాతం వరకు తగ్గిన చెల్లింపులను పొందారు. చివరిగా రెండవ త్రైమాసికం అంటే జూలై-సెప్టెంబర్ కాలంలో ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో దాదాపు 85% అందుకున్నారు.
కొనసాగుతున్న గందరగోళం
మార్కెట్లో పడిపోయిన ఐటీ స్టాక్స్.. నేడు ఇంట్రాడేలో నిఫ్టీ ఐటీ నష్టాలను చూసింది. దీనికి ప్రధాన కారణం ప్రముఖ ఐటీ సేవల కంపెనీ అయిన క్యాప్ జెమినీ ఆదాయాలు అంచనాలను అందుకోలేకపోవటమేనని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెంచ్ ఐటీ కంపెనీ అమ్మకాలు 2 శాతం క్షీణతను నమోదు చేయటంతో ఆ ప్రభావం మార్కెట్లోని ఇతర టెక్ కంపెనీలపై కనిపించింది. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సహా ఇతర స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించటంతో కొంత గందరగోళం కొనసాగుతోంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu infosys company Latest News in Telugu Paper Telugu News shocked employees Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.