हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Indian Air Force : భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్!

Divya Vani M
Indian Air Force : భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్!

భారత రక్షణ రంగం మరో పెద్ద అడుగు వేసింది. దేశీయంగా తయారయ్యే తొలి ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ (Stealth fighter jet) ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే ఈ ప్రతిష్ఠాత్మక యోజనకు ఆమోదం తెలిపారు.ఈ యుద్ధ విమానం (Fighter plane) డబుల్ ఇంజన్‌తో, ఆధునిక ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీతో రూపుదిద్దుకోనుంది. ఇది చైనా, పాకిస్థాన్ లాంటి దేశాల వేగవంతమైన వైమానిక విస్తరణకు సమర్థవంతమైన ప్రతిస్పందనగా మారనుంది. చైనా ఇప్పటికే తన ఆరో తరం యుద్ధ విమాన ప్రోటోటైప్‌ను పరీక్షిస్తుండగా, పాకిస్థాన్ ఇప్పటికే జే-10 వంటి ఆధునిక విమానాలను కలిగి ఉంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, చైనా తన అత్యంత ఆధునిక జే-35 స్టెల్త్ జెట్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

Indian Air Force : భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్!
Indian Air Force : భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్!

ఈ పరిణామాలన్నీ చూస్తే, భారత్‌కు తన స్వదేశీ స్టెల్త్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టమవుతోంది.ఈ ప్రాజెక్టును ప్రభుత్వ సంస్థ అయిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) పర్యవేక్షించనుంది. ఇది పూర్తిగా దేశీయ సంస్థలతోనే సాగించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ప్రైవేట్ కంపెనీలు కూడా భాగస్వామిగా వచ్చేందుకు అవకాశం కల్పించారు. స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్ రూపంలో ఈ ప్రాజెక్టులో పాల్గొనడానికి బిడ్లు దాఖలు చేయవచ్చని రక్షణ శాఖ తెలిపింది.ప్రారంభ దశలో స్టెల్త్ జెట్ నమూనాను అభివృద్ధి చేయడానికి ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణలు (EOI) త్వరలో ఆహ్వానించనుంది.

ఇది భారత స్వయం సమర్థతపై దృష్టి పెట్టే కీలక దశగా మారబోతోంది.ఈ ప్రాజెక్టు వల్ల ఇంకో ముఖ్య లాభం కూడా ఉంది. ఇప్పటివరకు భారత వైమానిక దళం ఎక్కువగా రష్యా, ఫ్రాన్స్ నుంచి విమానాలపై ఆధారపడుతోంది. 42 స్క్వాడ్రన్ల అవసరానికి గాను 31 మాత్రమే ఉండటంతో, ఈ కొరత తీర్చేందుకు స్టెల్త్ ప్రాజెక్టు ఎంతో సహకరించనుంది.ఈ ఏడాది మార్చిలో ఓ ఉన్నత స్థాయి రక్షణ కమిటీ ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని సిఫార్సు చేసింది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం — హెచ్‌ఏఎల్ (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)పై ఉన్న ఒత్తిడిని తగ్గించడం. దీని ఫలితంగా, ప్రైవేట్ రంగానికి పెద్ద దారులు తెరచనున్నాయి.భారతదేశం ఇప్పుడు కేవలం యుద్ధ విమానాల దిగుమతిదారుగా కాకుండా, వాటిని తయారుచేసే దేశంగా ఎదుగుతోంది. ఇది దేశ భద్రతకే కాక, ఆర్ధికంగా కూడా పెద్ద మైలురాయిగా నిలవబోతోంది.

Read Also : Ayodhya : అయోధ్య రానున్న ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

📢 For Advertisement Booking: 98481 12870