📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

chhaava :’ఛావా’ సినిమా ప్రభావం.. ఔరంగజేబు సమాధిని తొలగింపుకు యత్నం

Author Icon By Vanipushpa
Updated: March 18, 2025 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛావా’ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సినిమాలో ఔరంగజేబు హిందువులపై చేసిన దాడులు కళ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అంతకు ముందు నుంచే హిందువుల వ్యతిరేకి అయిన ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి. కానీ ‘ఛావా’ సినిమా వచ్చిన తర్వాత ఈ డిమాండ్ మరింత తీవ్రతరం అయింది. ఈ క్రమంలోనే ఔరంగజేబు సమాధిని తొలగించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.


నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘర్షణలు
దీంతో నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు, రాళ్లు రువ్వారు. దీంతో నాగ్‌పూర్‌ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.సోమవారం నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. విశ్వ హిందూ పరిషత్ (VHP) ,బజరంగ్ దళ్ సహా హిందూ సంస్థల సభ్యులు శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ నిరసన నిర్వహించారు. అనంతరం ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు.
శంభాజీ నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు
పరిస్థితి మరింత దిగజారిందని, శంభాజీ నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని , ప్రజా ఆస్తులు దెబ్బతిన్నాయని, వాహనాలకు నిప్పు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు అల్లర్లకు పుకార్లే కారణమని తేల్చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
నితిన్ గడ్కరీ స్పందన
ఈ ఘటనపై నాగ్‌పూర్ ఎంపీ నితిన్ గడ్కరీ స్పందించారు. నగరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని గడ్కరీ కోరారు. పుకార్ల కారణంగా,నాగ్‌పూర్‌లో మతపరమైన ఉద్రిక్తత తలెత్తిందని ఆయన అన్నారు. ఇటువంటి సమయంలో శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరూ పుకార్లను నమ్మవద్దని , శాంతిని కాపాడుకోవాలని ఆయన కోరారు. ప్రజలు బయటకు రావొద్దని , శాంతిభద్రతల వ్యవస్థకు సహకరించాలని గడ్కరీ అన్నారు.

#telugu News Ap News in Telugu Attempt to remove Aurangzeb's tomb Breaking News in Telugu Google News in Telugu Impact of the movie 'Chava' Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.