HoneyMoon Murder: మేఘాలయలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు

Read Time:  1 min
HoneyMoon Murder: మేఘాలయలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు
FONT SIZE
GET APP

మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.ఈ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, భార్య సోనమ్‌తో పాటు ఇతర నిందితులను పోలీసులు ఈస్ట్‌ కాశీ హిల్స్‌ ప్రాంతానికి తీసుకువెళ్లి, రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య జరిగిన తీరును సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. సోహ్రా ప్రాంతంలో ఈ ప్రక్రియను చేపట్టారు.ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మేఘాలయ డీజీపీ నాంగ్రాంగ్‌ తెలిపారు.వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్తపై అంతటి ద్వేషం ఎలా పెరిగిందనే అంశంపై ప్రధానంగా దృష్టి సారించాం.

HoneyMoon Murder: మేఘాలయలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు
HoneyMoon Murder

వాస్తవాలను ధృవీకరించుకోవాల్సిన

ఇప్పటివరకు ఇది కేవలం ప్రేమ వ్యవహారానికి సంబంధించిన హత్యగానే భావించాం. కానీ, దీని వెనుక మరిన్ని కారణాలు ఉండొచ్చనే కోణంలో దర్యాప్తును లోతుగా చేస్తున్నాం” అని ఆయన వివరించారు.నిందితులు ఇస్తున్న వాంగ్మూలాలతో పొంతన లేకపోవడంతో, వాస్తవాలను ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. క్రైమ్‌సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయడం ద్వారా మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని,వారు వెల్లడించారు. ప్రధాన నిందితురాలు సోనమ్‌ (Sonam) ను రేపు న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు.

Read Also: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ దుర్ఘటనలో బాల్కనీ నుండి దూకిన మెడికోస్

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.