కొత్త వస్తు, సేవల పన్ను జీఎస్టీ విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టింది (GST Rates). ప్రభుత్వ నిర్ణయంపై పలువురు రాజకీయ, వ్యాపార వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ దివాళీ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన దీపావళి కానుక అద్భుతంగా ఉందంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) కితాబిస్తున్నారు. ప్రతి భారతీయుడికి ఇది అతిపెద్ద దీపావళి కానుక. రోజూవారీ నిత్యావసరాలు, వైద్యం, విద్య, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించారు. ఇప్పుడు కిరాణ సామగ్రి చౌక ధరకే లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చు తగ్గుతుంది. విద్య అందుబాటు ధరలో ఉంటుంది. రైతులకు మద్దతు దొరుకుతుంది. మొత్తంగా తదుపరి జీఎస్టీ జీవన సౌలభ్యం,ఆర్థిక వ్యవస్థకు ఊతం’ అని హర్ష్ గోయెంకా (Harsh Goenka) ఎక్స్లో పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

కొత్త వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం స్లాబుల్లో 12, 28 శాతం స్లాబులను తీసేశారు. ఈ క్రమంలోనే 12 శాతం జీఎస్టీని ఎదుర్కొంటున్న 99 శాతం వస్తూత్పత్తులను 5 శాతంలోకి, 28 శాతం పన్ను పడుతున్న వాటిలో 90 శాతం వస్తూత్పత్తులను 18 శాతంలోకి తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ప్రత్యేకంగా 40 శాతం స్లాబును ఏర్పాటు చేయగా, ఇందులో 6-7 వస్తూత్పత్తులే ఉంటున్నాయి. వీటిలో పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ బైకులు, కార్లు మొదలైన వాటిని ఉంచుతున్నారు. ఈ నెల 22 నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తూత్పత్తులపై నూతన పన్ను రేట్లు వర్తించనున్నాయని జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
గోయెంకా కుటుంబం ఎక్కడి నుండి వచ్చింది?
గోయెంకా 2013 ఏప్రిల్ 14న కోల్కతాలో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, పెద్ద హర్ష్ వర్ధన్ మరియు చిన్న సంజీవ్. గోయెంకా కుటుంబం వడ్డీ వ్యాపారులు మరియు వ్యాపారుల మార్వారీ సమాజానికి చెందినది మరియు పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్కు చెందినది.
హర్ష్ లేదా సంజీవ్ గోయెంకా ఎవరు ధనవంతుడు?
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆయన 1045వ స్థానంలో ఉన్నారు. ఆయనకు తమ్ముడు సంజీవ్ గోయెంకా ఉన్నారు, ఆయన తండ్రి సలహాతో వ్యాపార ఆస్తులను స్నేహపూర్వకంగా పంచుకున్నారు. 9 అక్టోబర్ 2024 నాటి ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది ధనవంతులైన వ్యాపారవేత్తల జాబితా ప్రకారం, హర్ష్ గోయెంకా $4.1 బిలియన్ల నికర విలువతో 76వ స్థానంలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: