📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Guyana: గయానాలో చమురు నిక్షేపాలు ఉన్నాయన్న హర్దీప్ సింగ్

Author Icon By Ramya
Updated: June 17, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అండమాన్ సముద్రంలో ‘గయానా తరహా’ చమురు నిక్షేపాలు – భారత్ ఆర్థికవృద్ధికి కొత్త దారి

భారతదేశం ఎప్పుడో ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ సముద్రం నుంచి వెలువడింది. గయానాలో (Guyana) వంటి భారీ చమురు నిల్వలను అక్కడ గుర్తించినట్టు కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh) అధికారికంగా ప్రకటించారు. అంచనాల ప్రకారం దాదాపు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు అండమాన్ సముద్రపు లోతుల్లో నిక్షిప్తమై ఉండొచ్చని చెప్పారు. ఇది సుమారు 1,160 కోట్ల బ్యారెళ్లకు సమానం కావడంతో ఇది గయానా చమురు నిల్వలకు సమానంగా భావిస్తున్నారు. ఈ కనుగొనం భారతదేశం అంతర్జాతీయ చమురు మార్కెట్లో కీలక పాత్ర పోషించగలదనే ఆశలు రేకెత్తిస్తోంది.

ఆర్థిక వ్యవస్థకు బలమైన ఇంధనం – 20 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో గయానా (Guyana) తరహా చమురు నిక్షేపాలను ఉన్నాయని భారత్ కనుగొంది. సుమారు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని భారత పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh) వెల్లడించారు. దీని కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. గయానాలో కనుగోన్నంత పెద్ద మొత్తంలోనే.. అండమాన్ ప్రాంతంలో కూడా చమురు నిక్షేపాలు ఉన్నాయని.. అవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3.7 ట్రిలియన్ల డాలర్ల నుంచి 20 ట్రిలియన్ల డాలర్ల వరకు విస్తరించడంలో సహాయపడుతాయని హర్దీప్ సింగ్ తెలిపారు. కానీ అక్కడ చమురు నిల్వలను వెలికి తీయడం.. భారీ ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన అన్నారు.

తవ్వకాల్లో భారీ పెట్టుబడులు – ఆధునిక సాంకేతికతే కీలకం

ఒక్కో బావి తవ్వడానికి దాదాపు రూ.850 కోట్లు ఖర్చవుతుందని.. గయానాలో కూడా కొత్త చమురు నిక్షేపాల కోసం 44 బావులు తవ్వాల్సి వచ్చిందని.. దానికోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారన్నారు హర్దీప్ సింగ్. అక్కడ ఒక్కో బావికి 10 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం రూ.37,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎక్కువ భాగం అండమాన్, నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకానికి ఉపయోగించారు.

గయానా మాదిరిగానే అండమాన్ నుంచి ప్రగతి దిశగా

అండమాన్ సముద్రంలో దాదాపు రెండు లక్షల కోట్ల లీటర్ల చమురు నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తోంది కేంద్రం. ఇది సుమారు 1,160 కోట్ల బ్యారెళ్లకు సమానం. గయానాలో కూడా ఇంతే మొత్తంలో చమురు నిక్షేపాలను వెలికి తీశారు. అక్కడ హెస్‌ కార్పొరేషన్‌, చైనాకు చెందిన సీఎన్‌ఓఓసీ కంపెనీలు ఈ నిక్షేపాలను కనుగొన్నాయి. దీంతో గయానా ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా అవతరించింది.

Read also: Covid: హమ్మయ్యా..తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

#20TrillionDollarEconomy #AndamanBlackGold #AndamanOilBoom #CrudeOilReserves #EnergyIndependenceIndia #HardeepSinghPuri #IndiaEnergyRevolution #OilExplorationIndia #OilIndia #ONGC #PetroleumWealth Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.