భారీగా తగ్గించిన జీఎస్టీ రేటు
ఒకప్పుడు కారు అనేది ధనవంతులకు మాత్రమే పరిమితం. కానీ నేడు మధ్యతరగతి వారికి అదొక అవసరం. మధ్యతరగతి వారికి ఆదాయం పెరిగింది. దీంతో సౌకర్యవంతమైన జీవనవిధానాన్ని అలవర్చుకుంటున్నారు ప్రజలు. ఇక ప్రభుత్వం కూడా పలు రాయితీలను ఇవ్వడంతో అనేకుల దృష్టి కార్ల కొనుగోలుపై పడింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నకార్లు 350 సిసి వరకు వమోటార్ సైకిళ్లు, త్రీ వీలర్లు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్ లపై జీఎస్టీని(GST Reduction) 28శాతం నుంచి 18శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తగ్గించిన కొత్త రేట్లు ఈనెల 22 నుండి వర్తిస్తాయని తెలిపారు.
ఆటో పరిశ్రమలో ఎక్కువ భాగంలో..
ముఖ్యంగా పెట్రోల్(petrol), డీజిల్ హైబ్రిడ్ కార్లపై భారీ ఉపశమనం లభించింది. గతంలో వాటిపై 28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు అవి 18శాతానికి తగ్గించింది.
పెట్రోల్ వాహనాల ఇంజిన్ సామర్థ్యం 1,200 సిసి, పొడవు 4,000 మిమీ కంటే తక్కువ ఉండాలి. అలాగే డీజిల్ ఇంజిన్ల సామర్థ్యం 1,500 సిసి, పొడవు 4,000 మిమీ కంటే తక్కువ ఉండాలి.
కాగా ఆటో పరిశ్రమలో ఎక్కువ భాగం 1,200 సిసి నుండి 1,500 సిసి ఇంజిన్ సామర్థ్యం గల వాహనాలే ఉన్నాయి. అందులో మారుతి సుజుకి(Maruti Suzuki) ఆల్టో, థార్, టాటా నెక్సాన్, కియా సోనైట్, హ్యుందాయ్ ఐ10, ఐ20, వెన్యూ, ఆరా వంటి కార్లు ఉన్నాయి.
కానీ 1,200 సిసి నుంచి 1,500 సిసి ఇంజిన్ సామర్థ్యం కంటే ఎక్కువగా ఉన్న వాహనాల జీఎస్టీలో ఎలాంటి మార్పు లేదు. అలాంటి వాహనాలు 40శాతం జీఎస్టీ పరిధిలోనే ఉంటాయి.
టూ వీలర్ వాహనాలకైతే..
టూ వీలర్ వాహనాల విషయానికొస్తే.. కేంద్ర ప్రభుత్వం 350సిసి వరకు మోటార్ సైకిళ్లపై 28 శాతం జీఎస్టీని(GST Reduction)18శాతానికి తగ్గించింది.
ఇందడులో హీరో స్పెండర్ నుండి హోండా షైన్, బజాజ్ పల్సర్, కేటిఎం డ్యూక్, టివిఎస్ అపాచీ వరకు అనేక మోడళ్లు ఉన్నాయి. అయితే 350 సిసి కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న అన్ని ద్విచక్ర వాహనాలు ఇప్పుడు 40శాతం పన్ను స్లాబ్ కిందకు వస్తాయి.
Read Hindi news: hindi.vaartha.com
Read Also: