📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Content Creators: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

Author Icon By Vanipushpa
Updated: March 18, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుకోవటంతో ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్ చూడగలుగుతున్నారు. దీంతో ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ సహా అనేక ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ సృష్టించడాన్ని లక్షలాది మంది యువత ఇప్పుడు తమ కెరీర్‌గా మార్చుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రైవేట్ భాగస్వామ్యం కింద పని చేస్తుంది
మార్కెట్లోని అనేక వ్యాపార సంస్థలు లేదా బ్రాండ్లకు సైతం వారు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను సపోర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1 బిలియన్ డాలర్ల నిధిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రపంచ ఆడియో-విజువల్ అండ్ వినోద సమ్మిట్ (WAVES) 2025 సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధిని ప్రకటించారు. ఈ నిధి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద పని చేస్తుందని తెలుస్తోంది.
ఉన్నత స్థాయి శిక్షణ
దీనితో పాటు రూ.391 కోట్ల వ్యయంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని స్థాపించాలని నిర్ణయించబడింది. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఐఐటీ, ఐఐఎం తరహాలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇక్కడ కంటెంట్ క్రియేషన్ అండ్ డిజిటల్ మీడియాకు సంబంధించిన ఉన్నత స్థాయి శిక్షణ అందించబడుతుంది.

ప్రపంచవ్యాప్త ఇ-మార్కెట్‌ప్లేస్‌
ఇదే క్రమంలో దేశంలో ఇన్ ఫ్లుయన్సర్ల వ్యవస్థ కూడా వేగంగా అభివృద్ధ చెందుతోందని తాజా నివేదికల ప్రకారం వెల్లడైంది. దీని విలువ దాదాపు రూ.3375 కోట్లుగా ఉంది. దేశంలో 12 శాతం కంటెంట్ క్రియేటర్లు నెలకు రూ.లక్ష నుండి రూ.10 లక్షల మధ్య సంపాదిస్తున్నారని వెల్లడైంది. అలాగే 90 శాతం మంది రానున్న రెండేళ్లలో తమ ఆదాయం మరింతగా పెరుగుతోందని భావించటం గమనార్హం. ప్రభుత్వం వేవ్స్ బజార్ అనే ప్రపంచవ్యాప్త ఇ-మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించింది. ఈ మార్కెట్‌ప్లేస్ భారతీయ తయారీదారులను అంతర్జాతీయ మార్కెట్‌లతో అనుసంధానిస్తుంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Good news from the center Google News in Telugu Latest News in Telugu Paper Telugu News social media influencers Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.