📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

మొదటి పెళ్లి రద్దుకాకున్నా.. రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు

Author Icon By Vanipushpa
Updated: February 7, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎన్‌.ఉషారాణి Vs మూడుదుల శ్రీనివాస్‌ కేసులో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఉషారాణి అనే మహిళకు 1999లో నోముల శ్రీనివాస్‌ అనే వ్యక్తితో మొదట వివాహం జరిగింది. అనంతరం విబేధాలతో ఈ జంట 2005లో విడిపోయింది. పరస్పర అంగీకారంతో వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత 2006లో ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. మూడుదుల శ్రీనివాస్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. 2008లో వారికి ఓ బిడ్డ పుట్టింది. కొన్నాళ్లు సాఫీగా సాగిన కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో . శ్రీనివాస్, అతడి కుటుంబసభ్యులపై గృహహింస కేసు పెట్టింది. తన బిడ్డతో కలిసి రెండో భర్త ఇంటి నుంచి వచ్చేసిన ఆమె.. విడాకులు కోరింది. 2012లో మెయింటెనెన్స్‌ కోసం హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఉషారాణి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు ఆమె నెలకు రూ.3,500, బిడ్డకు రూ.5,000 భరణం చెల్లించాలని మూడుదుల శ్రీనివాస్‌ను ఆదేశించింది. అయితే, ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన అతడు.. మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దుకానందున ఆమెకు తాను భరణం చెల్లించాల్సిన అవసరంలేదని వాదించారు. అతడి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. బిడ్డకు మాత్రమే భరణాన్ని ఖరారు చేసింది. ఆమెకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ ఉషారాణి సుప్రీంకోర్టు గడపతొక్కారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అన్ని విషయాలను పరిశీలించి కుటుంబకోర్టు తీర్పును సమర్థించింది. ఆమె గురించి ముందే తెలిసిన ప్రతివాది.. పెళ్లి చేసుకొని విశేషాధికారాలు పొందాడు. బాధ్యతలకు వచ్చేసరికి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. రద్దైన రెండు వివాహాల నుంచి ఆమె మెయింటెనెన్స్‌ కోరి ఉంటే తప్పించుకోడానికి అవకాశం ఉండేది.. పోషణ ఆమెకు కల్పించే లబ్ధి కాదు.. చట్టబద్ధ నైతికహక్కు. ఫ్యామిలీ కోర్టు 2012లో ఆమెకు ప్రకటించిన మెయింటెనెన్స్‌ను పునరుద్ధరిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News pay maintenance Supreme Court Telangana Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.