📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె

Encounter : మరోసారి జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. జవాన్ మృతి

Author Icon By sumalatha chinthakayala
Updated: April 24, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Encounter: గురువారం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. బసంత్‌గఢ్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఓ ప్రాంతంలో ఎటాక్ చేసింది. ఈ టైంలో జరిగిన కాల్పుల్లో జవాన్ అమరుడైనట్టు సైన్యం ప్రకటించింది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా

కాగా, 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు సైన్యం వేట సాగిస్తోంది. లోయలోని అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతోంది. పహల్గాం దాడిని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దాడి జరిగిన క్షణం నుంచి వందల మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఆపరేషన్ ఏరివేత చేపట్టారు. బోర్డర్‌లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టారు. డేగ కళ్లతో పహారా కాస్తున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన కరెన్సీ, మారణాయుధాలు స్వాధీనం

ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల సమయంలో కూడా కొందరు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అలా వచ్చిన ఉగ్రవాదులను భారత్ సైన్యం తుపాకీగుళ్లతో గతం పలికింది. బోర్డర్‌లోనే వాళ్లను మట్టుబెట్టి వారి వద్ద నుంచి పాకిస్థాన్‌కు చెందిన కరెన్సీ, మారణాయుధాలు స్వాధీనం చేసుకుంది. ఇలాంటివి మరిన్ని జరగొచ్చనే అంచనాలతో పూర్తి అలర్ట్‌గా సైన్యం ఉంది.

Read Also: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

Breaking News in Telugu encounter Google news Google News in Telugu Jammu And Kashmir Jawan dies Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.