📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు

Author Icon By Vanipushpa
Updated: February 5, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. దాదాపు 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు 8.10 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 12.43 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. ఈ క్రమంలోనే పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్‌ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రపతి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ద్రౌపదీ ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాహుల్‌ గాంధీ నిర్మాణ్‌ భవన్‌లో ఓటు వేశారు. ఢిల్లీ సీఎం అతిశీ కాల్‌కాజీలో ఓటు వేయగా.. గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా రాజ్‌ నివాస్‌ మార్గ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి జై శంకర్‌.. తన సతీమణితో కలిసి తుగ్లక్‌ క్రెసెంట్‌లో ఓటు వేశారు. అలానే ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్ సిసోడియా తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఆనంద్‌ నికేతన్‌లో ఓటు వేశారు. భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్ కె. త్రిపాఠీ కమ్రాజ్‌ లేన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Delhi Elections Google News in Telugu Latest News in Telugu Paper Telugu News polling with peace Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.