Latest Telugu news : Election Commission: ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్ధి కలర్‌ ఫోటోలు..ఎన్నికల సంఘం

Read Time:  1 min
Election Commission: ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్ధి కలర్‌ ఫోటోలు..ఎన్నికల సంఘం
Election Commission: ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్ధి కలర్‌ ఫోటోలు..ఎన్నికల సంఘం
FONT SIZE
GET APP

ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం (Election Commission)కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్ధి కలర్‌ ఫోటో (Candidate’s color photograph)లను ముద్రించనున్నారు. అభ్యర్థి ముఖం మరింత స్పష్టంగా కనిపించేలా, ఫొటో కోసం కేటాయించిన స్థలంలో మూడింట ఒక వంతు ముఖానికి కేటాయిస్తారు. ఈ మార్పులు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి.

Election Commission: ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్ధి కలర్‌ ఫోటోలు..ఎన్నికల సంఘం
Election Commission: ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్ధి కలర్‌ ఫోటోలు..ఎన్నికల సంఘం


ఈవీఎంలపై గత కొంతకాలంగా విస్తృత చర్చ నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం అటువంటిది ఏంలేదని కొట్టిపారేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం (Election Commission)కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్ధి కలర్‌ ఫోటోలను ముద్రించనున్నారు. అభ్యర్థి ముఖం మరింత స్పష్టంగా కనిపించేలా, ఫొటో కోసం కేటాయించిన స్థలంలో మూడింట ఒక వంతు ముఖానికి కేటాయిస్తారు. ఈ మార్పులు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల ఓటర్లకు పోలింగ్ బూత్‌లో గందరగోళం లేకుండా, తాము ఎంచుకున్న అభ్యర్థికి సులభంగా ఓటు వేయడం సాధ్యమవుతుంది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఓటర్లకు అనువుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు ఎన్నికల కమిషన్ (Election Commission)తెలిపింది.

భారత ఎన్నికల సంఘం అంటే ఏమిటి?

భారత ఎన్నికల కమిషను, స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.

ఎన్నికల కమిషను వ్యవస్థ గురించి?

దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/india-is-pushing-ahead-despite-us-tariffs/national/549173/

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.