క్యాన్సర్ బారిన పడ్డ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. 46 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి తన భార్య అన్షు ని కాల్చి చంపి, అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది.

సంఘటన వివరాలు
కుల్దీప్ త్యాగి ఇటీవల క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. వైద్యులు చికిత్స ఖర్చుతో పాటు, పూర్తిగా కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, తన కుటుంబం ఆర్థికంగా భారించకూడదని భావించిన త్యాగి, భార్యతో కలిసి జీవితం ముగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు .
సూసైడ్ నోట్ వివరాలు
తన సూసైడ్ నోట్లో త్యాగి ఇలా రాశారు- నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను. నా కుటుంబ సభ్యులకు ఇది తెలియదు. చికిత్సపై డబ్బు ఖర్చు చేయడం వృథా అని భావిస్తున్నాను, ఎందుకంటే కోలుకునే అవకాశం లేదు. పైగా చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తనువు చాలించాలని త్యాగి నిర్ణయించుకున్నాడు. ఎల్లప్పుడూ కలిసే ఉంటానని భార్య అన్షు త్యాగికి చేసిన ప్రామిస్ గుర్తుకువచ్చింది. దీంతో ఇంట్లోని లైసెన్స్డ్ రివాల్వర్ తో భార్యను కాల్చి చంపి, తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఇది నా స్వంత నిర్ణయం. నా పిల్లలను ఈ విషయంలో తప్పుపట్టవద్దు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన జరిగిన సమయంలో వారు ఇంట్లోనే ఉన్నారు. కాల్పుల శబ్దం విని వారు తల్లిదండ్రుల గదికి పరిగెత్తారు. అప్పటికే త్యాగి నేలపై, అను త్యాగి మంచంపై రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు వారిని మరణించినట్లు ప్రకటించారు .
పోలీసుల దర్యాప్తు
పోలీసులు సంఘటన స్థలంలో లైసెన్స్డ్ రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఘజియాబాద్ పోలీసులు వెల్లడించారు . త్యాగి సూసైడ్ నోట్లో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తున్నారు .
Read also: PM Modi : అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని షెడ్యూల్ ఖరారు