📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఆప్ అగ్రనేతలకు చావు దెబ్బ!

Author Icon By Vanipushpa
Updated: February 8, 2025 • 6:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడి అవుతున్నా యి. బీజేపీ అధికారం ఖాయమైంది. ఆప్ ప్రముఖులు ఓటమి బాట పట్టారు. కేజ్రీవాల్ తో సహా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇప్పటికే ఓడిపోయారు. సీఎం అతిశీ విజయం దిశగా వెళ్తున్నారు. బీజేపీ ఇప్పటికే 48 సీట్లలో స్పష్టమైన ఆధిక్యతలో కొనసాగుతోంది. ఆప్ 22 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాగా, కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. ఇక, ఆప్ ముఖ్య నేతలే పరాజయం దిశగా ఉండటం తో ఆప్ క్యాంప్ లో ఒక్క సారిగా అనిశ్చితి ఏర్పడింది.

కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఊహించని విధంగా న్యూఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కు తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఆప్ అగ్రనేతలను మట్టి కరిపించింది. కేజ్రీవాల్ తో సహా ముఖ్య నేతలను ఓటర్లు చావు దెబ్బ కొట్టారు. పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో మూడు వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. అదే విధంగా లిక్కర్ కేసులో జైలు శిక్ష అనుభవించిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం ఓటమి పాలయ్యారు. జంగ్ పూర్ లో సిసోడియా పై బీజేపీ అభ్యర్ధి తర్వీందర్ సింగ్ గెలుపు సాధించారు. ఆప్ ముఖ్య నేత.. సీఎం అతిశీ కల్ కాజీ నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. మరో నేత సౌరభ్ భరద్వాజ్ వెనుకంజలో ఉన్నారు.

ఎవరీ పర్వేష్ వర్మ?

కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్ధి పర్వేష్ వర్మ దాదాపు 1200 ఓట్లతో విజయం సాధించారు. తొలి నుంచి కేజ్రీవాల్ లక్ష్యంగా పర్వేష్ దూకుడుగా వ్యవహరించారు. యమునా నది విషయంలోనూ ధీటుగా బదులిచ్చారు. సీఎం రేసులో ఉన్న పర్వేష్ ఫలితం రాగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. సానుభూతి కలిసి వస్తుందనే ఆప్ అంచనాలు తారు మారు అయ్యాయి. దీంతో, ఈ సాయంత్రం బీజేపీ కార్యాలయంలో సంబరాలకు నేతలు సిద్దం అవుతున్నారు. ప్రధాని మోదీ బీజేపీ కార్యాలయానికి రానున్నారు. వరుస పరాజయాలతో కాంగ్రెస్ చతికిలబడింది. ఇప్పుడు ఆప్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

#telugu News Ap News in Telugu app BJP Breaking News in Telugu delhi election counting. Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.