ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రస్తుతం సైప్రస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ఓ ప్రత్యేక ఘట్టం చోటు చేసుకుంది. నికోసియా నగర కౌన్సిల్ సభ్యురాలు మైకేలా కిథ్రియోటి మ్లాపా, చారిత్రక నికోసియా కేంద్రంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. అంతటితో ఆగకుండా, ఆయన పాదాలకు నమస్కరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.జూన్ 15న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైకేలా (Michaela) చేసిన నమస్కారం ద్వారా ఆమెకు భారతీయ సంస్కృతిపై ఉన్న గౌరవం కనిపించింది. ప్రధాని మోదీ కూడా ఆమెకు హృదయపూర్వకంగా స్పందించారు. ఆమె తలపై చేయి ఉంచి ఆశీర్వాదం ఇచ్చారు.
ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు
భారతీయతను గౌరవంగా చాటిన మైకేలా నడవడిని ప్రధాని మోదీ ఎంతో అభినందించారు. విదేశీయురాలిగా భారతీయ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవడం, గౌరవించడం నిజంగా ప్రశంసనీయం అని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందన
ఈ సంఘటనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో స్పందించారు. ఇది మనసును హత్తుకునే ఘటన. భారతీయ విలువలు ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపిస్తున్నాయో ఇది ఓ ప్రతీక. ప్రధాని మోదీకి ఇచ్చిన గౌరవం, భారతదేశం పెరుగుతున్న ప్రతిష్ఠకు నిదర్శనం అని పేర్కొన్నారు.
భారతీయతకు ప్రపంచం నుంచి అభిమానం
మైకేలా చేసిన నమస్కారం సాధారణ సంఘటన కాదు. ఇది విదేశీయులు భారతీయ సంప్రదాయాలను ఎంత గౌరవిస్తున్నారో చూపుతుంది. ప్రధానిగా మోదీ ఈ గౌరవాన్ని మరింత భిన్నంగా స్వీకరించారు. ఇది దేశానికి గర్వకారణం.
Read Also : KTR : జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటానన్న కేటీఆర్