భారతదేశం నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి, బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత ఓటింగ్ ప్రక్రియలో, ఆయన తన ప్రత్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం.
ప్రధాని, రాష్ట్రపతి సహా పలువురు శుభాకాంక్షలు
ఈ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi’s Murmu), ఇతర రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, ‘‘సీపీ రాధాకృష్ణన్ సుదీర్ఘ ప్రజా అనుభవం దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’’ అని అభినందనలు తెలిపారు.
అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ నిలుస్తారు – మోదీ
సోషల్ మీడియాలో స్పందించిన ప్రధాని మోదీ, ‘‘రాధాకృష్ణన్ తన పదవిని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆయన నాయకత్వం దేశాన్ని ముందుకు నడిపించేందుకు బలంగా నిలుస్తుంది,’’ అని పేర్కొన్నారు. ఆయనకు ఎన్డీఏ (NDA)కూటమి సంపూర్ణ మద్దతు లభించడం విజయానికి తోడైంది.
సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా రాధాకృష్ణన్
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్, బీజేపీ సీనియర్ నేతగా దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. ఆయన పార్టీలో కలిగిన సుదీర్ఘ ప్రయాణం, క్రమశిక్షణ, పాలనా పరిజ్ఞానం కారణంగా ఈ పదవికి ఎంపిక కావడం గమనార్హం. ఎంపిక ప్రక్రియలో ఎన్డీఏ సభ్యుల నుంచి అఖండ మద్దతు లభించింది.
ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన బి. సుదర్శన్ రెడ్డికి ఆశించిన మద్దతు లభించలేదు. ఈ ఫలితంతో విపక్షాల కూటమిలో కొన్ని అసంతృప్తులు బయటపడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం
కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు రాధాకృష్ణన్కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా, ఆయన సొంత రాష్ట్రమైన తమిళనాడులో పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో సంబరాలు నిర్వహించారు.
Read hindi news:hindi.vaartha.com
Read also