📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

కుప్పకూలిన స్టాక్.. ఇన్వెస్టర్లకు నష్టాలు

Author Icon By Vanipushpa
Updated: February 10, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. నష్టాలు తప్పవు. క్షణాల్లో పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే.. స్టాక్ మార్కెట్లపై పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని.. ఆర్థిక నిపుణుల సలహాతో పెట్టుబడులు పెట్టాలి.

డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు

ఇంకా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అస్థిరతకు లోనవుతున్నాయి.

ఇప్పుడు సోమవారం రోజు కూడా దేశీయ స్టాక్ మార్కె్ట్ సూచీలు పతనం అవుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా నష్టంతో 77,300 మార్కు పైన కదలాడుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 170 పాయింట్ల పతనంతో 23,400 మార్కు దిగువన ఉంది.

ఏకంగా 20 శాతం పడిపోయిన స్టాక్

ఇలా మార్కెట్లు భారీగా పడుతున్న క్రమంలోనే కొన్ని స్టాక్స్ లాభాల్లో,, మరికొన్ని స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పుడు ఒక్కరోజే ఒక్క కారణంతో ఏకంగా 20 శాతం పడిపోయిన స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే తిలక్‌నగర్ ఇండస్ట్రీస్. ఇది ప్రముఖ విస్కీ బ్రాండ్.. మాన్షన్ హౌస్ పేరిట విస్కీ, జిన్, బ్రాండీ తయారీ, మార్కెటింగ్ సహా విక్రయం చేస్తుంటుంది. ఇప్పుడు తన మాన్షన్ హౌస్, సేవాయ్ క్లబ్ బ్రాండ్ పేరును ఇతర సంస్థలు వినియోగిస్తుండటంపై కంపెనీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా.. దీనిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో స్టాక్‌పై భారీగా ఎఫెక్ట్ పడింది. దెబ్బకు 20 శాతం కుప్పకూలిపోయింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Collapsed stock Google News in Telugu investors Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.