📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Telugu News:ColdRef Syrup : మధ్యప్రదేశ్‌లో 12 మంది చిన్నారుల దుర్మరణం

Author Icon By Pooja
Updated: October 5, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh), రాజస్థాన్‌లలో కోల్డ్‌రిఫ్‌ దగ్గు సిరప్‌ కారణంగా చిన్నారుల మరణాలు సంచలనం సృష్టించాయి. చింద్వారా జిల్లా పరాసియాలో ఈ సిరప్ సేవించిన 10 మంది పిల్లలు దుర్మరణం చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ కేసులో బాధ్యులుగా గుర్తించిన డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Hyderabad Rains: తెల్లవారు జామునుంచి దంచికొడుతున్న వర్షం

పోలీసుల ప్రకారం, శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఈ సిరప్‌ను సరైన లైసెన్స్‌ లేకుండా తయారు చేసి పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్‌ సోనిపై IPC సెక్షన్లు 276, 105 మరియు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ 27A కింద కేసులు నమోదు చేశారు. అధికారులు మరిన్ని నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న దగ్గుమందు

ఇప్పటివరకు మొత్తం 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువగా 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉండగా, వీరి మరణాలకు కారణం అక్యూట్ కిడ్నీ ఇంజరీ(Acute kidney injury) అని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులు ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV–పుణే) సహా అనేక సంస్థలు నమూనాలను పరీక్షించగా, నీటి ద్వారా లేదా ఇతర వ్యాధుల వల్ల ఈ మరణాలు సంభవించలేదని తేల్చాయి. పిల్లల వైద్య చరిత్రలో అందరూ కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ వాడినట్లు బయటపడడంతో, ఇది ప్రధాన కారణమని అధికారులు నిర్ధారించారు.

కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ కారణంగా ఎంతమంది పిల్లలు మరణించారు?
ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా పరాసియా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Children Deaths ColdRef Syrup Deaths Google News in Telugu Latest News in Telugu MadhyaPradesh News Rajasthan News Telugu News Today Toxic Cough Syrup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.