Chhattisgarh: మార్చి 31 డెడ్ లైన్ కు మావోయిస్టు పార్టీ విరుగుడు వ్యూహం

Read Time:  1 min
Chhattisgarh
Chhattisgarh
FONT SIZE
GET APP

హైదరాబాద్ : (Chhattisgarh) వచ్చే మార్చి నెలాఖరుకు దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్రం అందుకు అనుగుణంగా ఛత్తీస్ గఢ్ సహా పలు రాష్ట్రాలలో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుండడం తెలిసిందే. వేల సంఖ్యలో భద్రతా బలగాలు నక్సలైట్ల కోసం కూ ంబింగ్ నిర్వహిస్తుండడం విదితమే. క్రమంలోనే ఛత్తీస్ ఘడ్ సహా పలుచోట్ల ఓవైపు ఎన్ కౌంటర్లు, మరోవైపు భారీగా లొంగుబాట్లు జరుగుతున్నాయి. అయితే మావోయిస్టులు మాత్రం కేంద్రంతో అమీతుమీకి సిద్దమవుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇప్పటి వరకు నక్సలైట్లు తమ ఆయుధాలతో లొంగిపోతారని భావించిన కేంద్రానికి తాజాగా వెలుగు చూస్తున్న సమాచారం కొంత ఇబ్బంది కరంగా వుందని తెలిసింది. ఆపరేషన్ కగార్ కారణంగా చెల్లా చెదురైన పార్టీ క్యాడర్ను మళ్లీ ఎలాగైనా ఒకచోటికి చేర్చేందుకు మావోయిస్టు నిర్ణయించింది. పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయించినట్లు తె దీనికి సంబంధించి కేంద్రానికి సమాచారం అందినట్లు తెలిసింది.

Read Also: PM Modi’s Assets : ప్రధాని మోదీ ఆస్తులు ఎంతో తెలుసా?

Chhattisgarh
The Maoist party’s counter-strategy to the March 31 deadline.

మార్చి 31 డెడ్‌లైన్ కు కేంద్ర లక్ష్యం

మార్చి 31వ తేదీ సమీపిస్తుండడంతో నక్సలైట్లను ఏరి వేసేందుకు భద్రతా బలగాలు ముందుకు కదలు తుండడంతో మావోయిస్టులు (Maoists) దీనికి విరుగుడుగా తమ క్యాడర్లో చాలా మందిని మైదాన ప్రాంతాలకు వెళ్లి అక్కడ తమ కు తెలిసిన వారి ఇళ్లలో, నమ్మకస్తులైన వారి ఇళ్లలో కొంతకాలం వుండాలని, వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలని పురమాయిం చినట్లు తెలిసింది. (Chhattisgarh) ప్రస్తుత పరిస్థితుల్లో అడవులను వదిలి బయటకు కావడం కష్టమే అయినా ఈ విషయంలో ఎలాగైనా రావాల్సిందేనని, పార్టీ బతకాలం టే ఈ సమయంలో కచ్చితంగా ధైర్యం చేయాలని అగ్ర నాయకత్వం పేర్కొనట్లు తెలిసింది.

మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం ఆదేశాల దరిమిలా ఛత్తీస్ ఘడ్లోని నక్సల్స్ కోట అబూజ్మడ్ నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలిసింది. ఇందులో కొందరు ఆయుధాలతో వెళ్లగా మరికొందరు తమ ఆయు ధాలను అబూజ్ మడ్లోనే సురక్షిత స్థావరాలలో దాచివుంచారని సమాచారం. ఆ బూజ్మడ్ను వీడిన నక్సలైట్లు మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు వలస వెళ్లినట్లుగా నిఘా వర్గాలు అనుమాని స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో నక్సల్స్ సాను భూతిపరుల ఇళ్లలో సోదాలు చేయాలని ఆదేశాలు అం దాయి. ఇటీవల తెలంగాణకు వచ్చి దొరికి పోయిన పలువురు నక్సలైట్లు కూడా ఇదే కోవకు చెందిన వారుగా ప్రచారం జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.