📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఐపీఎస్‌ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ!

Author Icon By Vanipushpa
Updated: February 22, 2025 • 10:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్‌ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలి
తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్‌ చేస్తూ.. 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ముగ్గురు ఐపీఎస్‌లు ఎవరంటే.. అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్‌ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంజనీ కుమార్‌, అభిలాష బిస్త్‌ డీజీ ర్యాంక్‌లో ఉండగా, అభిషేక్‌ మహంతి ఎస్పీ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.


ఏపీకి అలాట్‌ చేసిన కేంద్రం
కాగా ఈ ముగ్గురికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చిన కేంద్ర హోం శాఖ వెంటనే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలపై ఐపీఎస్‌లు కొంత సమయం కావాలని కోరే అవకాశం ఉంది. మూడు నెలల క్రితం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను ఇలాగే బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఈ ముగ్గురు ఐపీఎస్‌లకు షాక్‌ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి వీళ్లు ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ ముగ్గురిని కూడా కేంద్రం ఏపీకి అలాట్‌ చేసింది. కానీ, ఆ నిర్ణయాన్ని వీరు ముగ్గురు సవాల్‌ చేస్తూ క్యాట్‌ని ఆశ్రయించారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Central Home Department Google News in Telugu IPS officers Latest News in Telugu Paper Telugu News shocked Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.