📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Ration: రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం

Author Icon By Anusha
Updated: May 15, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పవచ్చు. ఇంతకు ఏంటా నిర్ణయం అంటే ప్రజలకు ఒకే సారి మూడు నెలల రేషన్‌ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం(Central government) సిద్ధం అయ్యింది. అంటే 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నారు.ఈ నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని దాన్ని ఈ నెలాఖరు(మే, 31) నాటికి లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా ముందుగానే రేషన్ పంపిణీ చేయలేదు. అలాంటిది ఇంత హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే పంపిణీ చేయాలని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి వాటిని లబ్ధిదారులకు పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ(Department of Public Distribution) అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రేషన్ పంపిణీ ప్రక్రియ మొదలయ్యింది.కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం రేషన్‌కార్డుదారులకు మూడు నెలల రేషన్ అనగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఒకే సారి ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు కేటాయించిన బియ్యాన్ని ముందుగా ఈ నెలాఖరు అనగా మే చివరి నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్ర ఆహార సరఫరా శాఖ(Central Food Supply Department) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఎఫ్‌సీఐ గోదాముల్లో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆయా రీజియన్ల మేనేజర్లకు సూచించింది.

Ration: రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం

వర్షాకాలం

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పలు రాష్ట్రాలు బియ్యం పంపిణీకి సిద్ధమవుతున్నాయి. అయితే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ యుద్ధం(WAR) వంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి.అయితే రానున్న వర్షాకాలంలో వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం పేర్కొన్నది. అయితే లబ్ధిదారులు ఒకే సారి మూడు నెలల రేషన్ పొందాలంటే ఈ నెలాఖరు అనగా మే 31, నాటికి ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలని లేదంటే రేషన్ ఇవ్వరని తెలిపారు.

Read Also: STALIN: సుప్రీం తీర్పును ప్రశ్నించిన ముర్ము – సీఎం స్టాలిన్ విమర్శలు

#CentralGovernment #FoodSecurity #GoodNewsForPeople #PublicWelfare #RationDistribution Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.