हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Jai shankar : విదేశాంగ మంత్రి జైశంకర్ భద్రతను పెంచిన కేంద్రం

Sudha
Jai shankar : విదేశాంగ మంత్రి జైశంకర్ భద్రతను పెంచిన కేంద్రం

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (Jai shankar)భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఆయన కాన్వాయ్‌లో అదనంగా బుల్లెట్ ప్రూఫ్ (bulletproof)వాహనాన్ని చేర్చారు. జైశంకర్‌కి ప్రస్తుతం జెడ్ కేటగిరి భద్రత కొనసాగుతోంది. మరోవైపు, ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.

 Jai shankar : విదేశాంగ మంత్రి జైశంకర్ భద్రతను పెంచిన  కేంద్రం
Jai shankar : విదేశాంగ మంత్రి జైశంకర్ భద్రతను పెంచిన కేంద్రం

భద్రత మరింత కట్టుదిట్టం
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశకంర్‌కి భద్రత పెంచినట్లు సమాచారం. అదనంగా మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన కాన్వాయ్‌లో చేర్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ముప్ప ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం జైశంకర్‌కి జెడ్ కేటగిరి భద్రత ఉంది. సీఆర్‌పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణ వలయంగా ఉంటారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ.. జైశంకర్ కాన్వాయ్‌లో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది అక్టోబర్ తర్వాత జైశకంర్ భద్రతను వై నుంచి జెడ్ కేటగిరికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలానే జైశకంర్ భద్రత బాధ్యతలు ఢిల్లీ పోలీస్ నుంచి సీఆర్‌పీఎఫ్‌కి బదిలీ చేశారు.
వీఐపీలకు సీఆర్‌పీఎఫ్ భద్రత
జెడ్ కేటగిరీ కింద 12 మందికి పైగా సాయుధ కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుతం అమిత్ షా, నితిన్ గడ్కరీ, దలైలామా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 210 మంది వీఐపీలకు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తోంది.అయితే ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జైశంకర్‌కు ఈ భద్రతతో పాటు అదనంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును కూడా ఆయన కాన్వాయ్‌లో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాక ఆయన నివాసం దగ్గర కూడా భద్రతను పెంచినట్లు తెలిసింది. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయన భద్రతను పెంచడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్ అధికారికి భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. సదరు అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్‌ చేసినట్లు నిఘా వర్గాలు స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతడిని 24 గంటల్లో ఇండియా విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారత్.. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఆ దేశ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. బదులుగా పాక్ దాడులకు దిగగా.. ఇండియన్ ఆర్మీ వాటిని చాకచక్యంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి.

Read Also : Paradip Port: ఓడరేవులో 21 మంది పాకిస్థాన్‌ సిబ్బంది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870