Satellite toll : మే 1 నుంచి శాటిలైట్‌ టోల్‌ విధానం పై కేంద్రం వివరణ !

Read Time:  1 min
Center explains satellite toll policy from May 1st!
Center explains satellite toll policy from May 1st!
FONT SIZE
GET APP

Satellite toll : కేంద్రప్రభుత్వం శాటిలైట్‌ ఆధారిత టోల్‌ విధానం అమలుపై క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఫాస్టాగ్‌ ఆధారిత టోల్‌ విధానం స్థానే శాటిలైట్‌ టోల్‌ విధానాన్ని మే 1 నుంచే అమలు చేయబోతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీనిపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

మే 1 నుంచి శాటిలైట్‌ టోల్‌

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇ-నోటీసులు

ఈ ప్రకటన ప్రకారం.. ఫీజు వసూలుకు టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ANPR) విధానాన్ని తొలుత ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద అమరుస్తారు. ఇందులో ఏఎన్‌పీఆర్‌తో పాటు ఫాస్టాగ్‌ కలగలిపి సేవలందిస్తారు. అంటే ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు వాహనం నంబర్‌ ప్లేట్లను గుర్తిస్తే.. వాహనాలు ఆగకుండానే ఫాస్టాగ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ద్వారా టోల్‌ వసూలు చేస్తారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇ-నోటీసులు జారీ చేస్తారు. ఫాస్టాగ్‌ రద్దు, పెనాల్టీలు విధిస్తారు. ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ శాఖ తెలిపింది.

Read Also: ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టులు లొంగుబాటు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.