📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pawan Kalyan :బీజేపీ ఆవిర్భావ దినోత్సవం..వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్

Author Icon By Anusha
Updated: April 6, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రోజు 1980, ఏప్రిల్ 6. దేశానికి ఒక కొత్త దిశను చూపించాలనే సంకల్పంతో శ్యామప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే అద్వానిల నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపించబడింది.అప్పుడు కేవలం ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది. ఎన్నో ఒడిదొడుకులు, రాజకీయ శత్రుత్వాలు ఎదుర్కొంటూ బీజేపీ పార్టీ ముందుకు సాగింది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తల మద్దతుతో, లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని విజయపథంలో దూసుకెళ్తోంది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా బీజేపీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు పవన్ కల్యాణ్ . ఆయన బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఎన్డిఏ భాగస్వామిగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తోంది.చారిత్రాత్మక ఉద్యమం ద్వారా బీజేపీ పార్టీ పుట్టింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్కే అద్వానీ లాంటి నేతలు ప్రజాస్వామ్య భారత్ కోసం పార్టీ స్థాపనకు కృషి చేశారు. దేశానికి సేవ చేయాలని ఆ మహనీయులు స్థాపించిన పార్టీఇప్పుడు కోట్ల మంది ఆశయాలను నెరవేరుస్తోంది.ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కృషి వల్ల ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో మూడు పర్యాయాలుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు చెబుతున్నా” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. రాబోయే ఎన్నికల్లో మరిన్ని విజయాలను సాధించి, దేశాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలలలోని “ఏక భారత, శ్రేష్ఠ భారత” సంకల్పాన్ని నిజం చేసేందుకు బీజేపీ నిత్యం ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

#AtalBihariVajpayee #BJP46Years #BJPFoundationDay #DeendayalUpadhyaya #ShyamaPrasadMukherjee Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.